ఎటు చూసినా వెక్కి వెక్కి ఎడ్చిన గొంతులు., సముద్రాన్ని తలపించేలా కారుతున్న కన్నీళ్లు, గుండెలు బాదుకుంటున్న అభిమానులు.. మిన్నంటిన రోదనల మధ్య తమిళనాట ఒక శకం ముగిసింది. అమ్మలా అందరినీ అక్కున చేర్చుకున్న పురచ్చి తలైవి… భూమాత ఒడిలోకి చేరింది. గుండెపోటుతో ఆదివారం రాత్రి కన్నుమూసిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియలు ముగిశాయి. చెన్నై మెరీనా బీచ్ లో అశేష జనవాహిని మధ్య ఎంజీఆర్ సమాధి పక్కనే ఖననం చేశారు. అమ్మను కడసారి చూసేందుకు తరలివచ్చిన అభిమానులు అమ్మా అమ్మా అంటూ గుండెలవిసేలా రోదించినా.. ఆ భగవంతుడి మ