తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ 2018-19 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టారు. రూ.1,74,453 కోట్ల రూపాయల బడ్జెట్ తో వార్షిక ప్రణాళిక రూపొందించారు. కేసీఆర్ సర్కార్ ప్రవేశ పెడ్తున్న పూర్తిస్థాయి చివరి బడ్జెట్ ఇదే కావడం విశేషం. ఇందులో గ్రామీణాభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేశారు. ఈటల రాజేందర్ బడ్జెట్ లోని ప్రధాన అంశాలను ఓసారి చూద్దాం..
- మొత్తం రాష్ర్ట బడ్జెట్ రూ. 1,74,453 కోట్లు
- రెవెన్యూ వ్యయం రూ. 1,25,454 కోట్లు
- రాష్ర్ట ఆదాయం రూ. 73,751 కోట్లు
- కేంద్ర వాటా రూ. 29,041 కోట్లు
- రెవెన్యూ మిగులు అంచనా రూ. 5,520 కోట్లు
- ద్రవ్య లోటు అంచనా రూ. 29,077 కోట్లు
- డబుల్ బెడ్ రూం ఇండ్లకు రూ. 2,643 కోట్లు
- నీటిపారుదల రంగానికి రూ. 25 వేల కోట్లు
- పంటల పెట్టుబడి మద్దతు పథకానికి రూ. 12 వేల కోట్లు
- రైతు బీమా పథకానికి రూ. 500 కోట్లు
- వ్యవసాయ యాంత్రీకరణకు రూ. 522 కోట్లు
- బిందు తుంపర సేద్యం రూ. 127 కోట్లు
- పౌరసరఫరాల శాఖకు రూ. 2946 కోట్లు
- ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే కొత్త పంచాయతీరాజ్ బిల్లు
- జీడీపీ ద్రవ్య లోటు 3.45 శాతం
- ఈ ఏడాది రాష్ర్ట జీడీపీ 10.4 శాతంగా ఉంటుందని అంచనా
- స్థూల ఉత్పత్తిలో గణనీయ ప్రగతి సాధించాం
- రాష్ర్ట జీడీపీ ఏటేటా పెరుగుతుంది
- ఈ నాలుగేళ్ల ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లు అధిగమించాం
- సీఎం కేసీఆర్ ఆర్థిక స్థితిని గాడిలోకి తెచ్చారని వెల్లడి