గతంలో తమిళ రాజకీయాలలోకి అడుగుపెడుతున్నాడు హీరో విశాల్ అనే ఊహాగానాలు వచ్చాయి. ఈ క్రమంలో విశాల్ ఏపీ రాజకీయాల గురించి ప్రస్తావన ఆసక్తిదాయకంగా నిలుస్తోంది. తనకు ఏపీ రాజకీయాలపై అవగాహన ఉందని చెప్పాడు విశాల్. వైఎస్ జగన్ పాదయాత్ర గురించి స్పందిస్తూ.. మూడు వేల కిలోమీటర్ల దూరం నడవడం మామూలు విషయం కాదు అని విశాల్ అన్నాడు.
ప్రతికూల వాతావరణంలో ప్రజల బాధలను వింటూ వారికి భరోసా ఇస్తూ ధైర్యం చెబుతూ ముందుకు సాగడం అభినందనీయమని విశాల్ అన్నాడు. ఏసీ రూముల్లో కూర్చుంటే ఏమీ తెలియదని అన్నాడు. జగన్ అంటే తనకు ఇష్టమే అని విశాల్ వ్యాఖ్యానించాడు.
గతంలో కోలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన సూర్య కూడా జగన్ పాదయాత్ర పై సంచలన కామెంట్లు చేశారు...జగన్ కష్టపడేతత్వం ఉందని చిన్నప్పటినుండి లీడర్షిప్ క్వాలిటీస్ జగన్ లో ఉన్నాయని అప్పట్లో సూర్య తెలియజేశారు. ఈ క్రమంలో తాజాగా విశాల్ కూడా స్పందించడంతో జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర కి రాజకీయ రంగంలోనే కాదు సినిమారంగంలో కూడా రోజురోజుకీ మరింత క్రేజ్ ఏర్పడుతుంది అని నిర్మొహమాటంగా చెప్పవచ్చు.