వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కాపు రిజర్వేషన్ గురించి చేసిన కామెంట్స్ రాజకీయ దుమారం రేపినాయి. నిజానికి జగన్ ఒకటి మాట్లాడితే టీడీపీ అనుకూల మీడియా దానిని వక్రీ కరించి మరొకటి ప్రచారం చేసింది. జగన్ కు కాపులు దూరం అయ్యారన్న ప్రచారాన్ని ముమ్మరం చేసింది. కాపు నేత , ముద్ర గడ కూడా 'పచ్చ' రంగు పులుము కున్నట్టు మాట్లాడినాడు. అయితే కాపు ల నుంచి వచ్చిన అనూహ్య స్పందన జగన్ కు ఆనందాన్ని ఇస్తుంది.
ఇక ప్రస్తుతం తూర్పు గోదావరిలో జగన్ పాదయాత్ర సాగుతున్న నేపథ్యంలో ఆయన పాదయాత్రను కాపులు అడ్డుకున్నారని ఒకవర్గం మీడియా గట్టిగా ప్రచారం జరుగుతోంది. అడ్డుకోవడం అంటే.. జగన్ ఆగిపోయాడని అనుకోవద్దు. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా లెక్కలో కాపులు జగన్ ను ముందుకు కదలనీయడం లేదు. అందుకు రుజువుగా ఫ్లకార్డులు పట్టుకున్న వారి ఫొటోలను తెలుగుదేశం మీడియా వర్గాలు హైలెట్ చేస్తున్నాయి.
అదలా ఉంటే.. పిఠాపురంలో కొత్త తరహా ఫ్లకార్డులు దర్శనమిచ్చాయి. జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ కొంతమంది కాపులు ఫ్లకార్డులు పట్టుకున్నారు. కాపు కార్పొరేషన్కు భారీగా నిధులు కేటాయిస్తానని అంటున్న జగన్ కు ధన్యవాదాలు తెలుపుతూ వారు ఫ్లకార్డులు చూపించారు. జగన్ కామెంట్స్ నేపథ్యంలో కుల విశ్లేషణలు తెగ చేసేస్తున్న వాళ్లు ఇప్పుడేమంటారో..!