జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ధవలేశ్వరం బ్యారేజీపై నిర్వహించిన కవాతు ఊహించని విధంగా సక్సెస్ కావడంతో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యకర్తలతో నాయకులతో తర్వాత రోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రజా వ్యతిరేకత ప్రభుత్వంపై ఎలా ఉంటుందో చూపించడానికే ఈ కవాతు నిర్వహించామని తెలిపారు.

Image may contain: 1 person, beard

మరోపక్క బల ప్రదర్శన అంటూ తనపై చేసిన కామెంట్లపై విరుచుకుపడ్డారు పవన్. నేను నిజంగా బలప్రదర్శన చేయాలనే ఉద్దేశంతో కవాతు నిర్వహిస్తే నా ముందు శత్రువు నిలవలేదని సంచలన కామెంట్ చేశారు. ఇదే క్రమంలో రాష్ట్రంలోని అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు.

Image may contain: 2 people, beard

రాజ్యాంగం ప్రకారం పాలన అందిస్తే ఇబ్బంది ఉండదని...కానీ అలా జరగట్లేదని పవన్ అన్నారు. కాటన్‌ ఎంతో ఉన్నత ఆశయంతో ఆనకట్ట కట్టారని తెలిపారు. సీఎం చంద్రబాబు కూడా పోలవరం ప్రాజెక్టును పారదర్శకంగా నిర్మించాలని సూచించారు. తాను బలప్రదర్శన చేస్తే శత్రువులు మిగలరని పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యానించారు. తిత్లీ తుఫాను బాధితులను పరామర్శించేందుకు రేపు శ్రీకాకుళం వెళ్లనున్నట్లు ఆయన వివరించారు.

Image may contain: 1 person, smiling, standing and beard

తన ప్రసంగంలో ఆవేశంగా ప్రసంగించిన పవన్ కళ్యాణ్ వారసత్వ రాజకీయాలపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. మరియు అదే విధంగా తనపై ఇంత ప్రేమ చూపించినందుకు గోదావరి జిల్లా ప్రజలకు తన ప్రసంగం సమయంలో కృతజ్ఞతలు తెలిపారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ ధవలేశ్వరం బ్యారేజీపై చేసిన కవాతు కార్యక్రమం ఏపీ రాజకీయాలను పెను సంచలనాలు సృష్టించింది అనటంలో ఎటువంటి సందేహం లేదు.




మరింత సమాచారం తెలుసుకోండి: