కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం సాధారణ ఎన్నికలతో గరం గరంగా మారింది. విమర్శల హోరు, ప్రచారాల జోరుతో రసవత్తర రాజకీయం నడుస్తుంది. టీడీపీ పార్టీ నుంచి యువనాయకుడు దేవినేని అవినాష్ వైసీపీ నేత కొడాలి నాని తో పోటీకి తల పడుతున్నారు. ఇద్దరు నాయకులు తమ పార్టీ జెండా పాతెందుకు కసిగా పోరాడుతున్నారు. రణక్షేత్రంలో భీకర పోరుతో యావత్ రాష్ట్రా ప్రజల చూపును తమ వైపు తిప్పారు. గతంలో లాగే టీడీపీ, వైసీపీ ల మధ్య ప్రతిష్టాత్మక పోరు నెలకొని ఉంది.

ఏపీ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకత ఉన్న కొడాలి నాని గత మూడు దఫాలుగా విజయం సాధిస్తూ వచ్చారు. అలాంటి బలమైన నేత ఢీ కొట్టేందుకు టీడీపీ పార్టీ వ్యూహాలు రచించి దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్ ను రంగంలో దింపారు. దేవినేని అన్ని విధాల సన్నద్ధం చేసి నాని పై బాణంలా ఎక్కుపెట్టింది టీడీపీ పార్టీ. రాష్ట్ర రాజకీయాల్లో విలక్షణ నేత కొడాలి నాని, టీడీపీ తరుపున రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీ లో చేరారు. 2014 లో ఎన్నికలో ఎనిమిది వేల ఓట్ల పైచిలతో అప్పటి తన ప్రత్యర్థి రావి వెంకటేశ్వరరావు పై గెలుపొందారు. టీడీపీ పార్టీకి కొరకరాని కొయ్యగా మారారు. నాని పై గెలుపు కోసం టీడీపీ స్థానిక నాయకులను అందరిని పక్కన పెట్టీ ఆర్థిక అంగ బలంలో ధీటైన అభ్యర్థిగా భావించి దేవినేని అవినాష్ కు టికెట్ ఇచ్చింది. అవినాష్ కు టికెట్ ఇచ్చే ముందు అక్కడి నుండి పోటీ చేయాలనుకున్న సీనియర్ నేతలందరినీ బుజ్జగించారు.

ఎన్టీఆర్ సొంత గడ్డగా భావించే గుడివాడలో ఈసారి టీడీపీ జెండా ఎగురవేయలని భావిస్తున్నారు. అయితే కొడాలి నాని మాత్రం గెలుపు కోసం తన సైన్యాన్ని సమీకరిస్తున్నరు. వెయ్యి మంది చంద్రబాబులు వచ్చిన తన గెలుపును అడ్డుకోలేరని ఢంకా బజాయించి చెబుతున్నారు. ఆయనకు పేద వర్గాల్లో మంచి గుర్తింపు ఉంది. తన సొంత డబ్బుతో పేద ప్రజలకు ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహించి, మంచి నీటి ట్యాంకర్లు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇలా ఎవరికి వారు వాళ్ళ బలాలను పెంచుకుంటూ ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. అయితే ప్రజలు ఎవరి వైపు అడుగులు వేస్తారు అన్నది ఆసక్తిగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: