తన తండ్రి వైయస్ వివేకానంద రెడ్డి గత నలభై సంవత్సరాల నుండి ప్రత్యక్ష రాజకీయాలలో ఉన్నారని వైయస్ వివేకానంద రెడ్డి కూతురు వైఎస్ సునీత తెలిపారు. తన తండ్రి మరణం పై ఎన్నో అనుమానాలు ఉన్నాయని అన్నారు. వాటిపై చంద్రబాబు ప్రభుత్వానికి ఎన్ని ఫిర్యాదులు చేసినా స్పందించలేదని ఇటీవల మీడియా సమావేశంలో పేర్కొన్నారు.


ముఖ్యంగా తన తండ్రిని హత్య చేయించడం వెనుక మంత్రి ఆదినారాయణ రెడ్డి హస్తం ఉందని ఆరోపణలు చేశారు. అంతేకాకుండా కేసును విచారిస్తున్న కొంతమంది అధికారులకు ఎమ్మెల్సీ బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డితో సన్నిహిత సంబంధాలున్నాయని అన్నారు. తన తండ్రి హత్య తరువాత ఎన్నో సమాధానాలు లేని ప్రశ్నలు వెంటాడుతున్నాయని ఆమె అన్నారు.


కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారని, హత్య జరిగిన వెంటనే అక్కడ చేయాల్సిన తన విధులను సీఐ చేయలేదని, ఎవరి ఆదేశాల మేరకు ఆయన చూస్తుండిపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు. మా ఇంటి పెద్ద ని హత్య చేయించి మాపై నింద వేస్తున్నారు అండి అంటూ విలేకరులతో తన గాదని చెప్పుకుంటూ ..ఇదెక్కడి న్యాయమని బాధపడ్డారు వైయస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత.



మరింత సమాచారం తెలుసుకోండి: