సీని విశ్లేషకుడు కత్తి మహేష్ పేరును బహుశా కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన సీని విశ్లేషకుడు మాత్రమే కాదు రాజకీయ విశ్లేషకుడు కూడా. ఆయన రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఒక రిపోర్టర్ అడిగిన కొన్ని నియోజకవర్గాలలోని రాజకీయ పరిస్థితి మరియు ఎవరి బలాబలాలు ఎలా ఉన్నాయి అన్న దాని పై అయన కోణం లో కొంత విశ్లేషణ ఇచ్చారు. అందులో భీమవరం నియోజకవర్గం గురించి అడుగగా ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ కచ్చితంగా ఓడిపోతారు అంటూ కుండబద్దలు కొట్టారు.

దీనికి కారణం ఏంటి అని కూడా ఆయన వివరించారు అక్కడ ఉన్న కాపు కులస్తుల ఓట్లు, రాజుల ఓట్లు చీలి రాజుల ఓట్లు పడక పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు అంట. అలాగే కడప గురించి చెబుతా ఆ నియోజవర్గం చాలా వరకు జగన్ మోహన్ రెడ్డి వైపు ఉన్న కొన్ని ప్రాంతాలు మాత్రం టీడీపీ కైవసం చేసుకుంటుందట. అలాంటి నియోజకవర్గం లో జమ్మలమడుగు ఒకటి అని చెప్పారు. ఇక కుప్పం విషయానికి వస్తే అక్కడి ఈసారి చంద్రబాబు నాయుడు గెలవడం అసాధ్యం అన్నారు.

దీనికి వివరణ ఇస్తూ తన సొంత జిల్లా అయిన చిత్తూర్ ను అభివృధి పథం వైపు నడిపించడం లో విఫలం అయ్యారని, అక్కడి ప్రజలు కనీస అభివృధి కూడా లేక విసిగిపోయారనీ అని గుర్తుచేశారు. ఇలా తన శైలిలో రాజకీయ విశ్లేషణ ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: