దీనికి కారణం ఏంటి అని కూడా ఆయన వివరించారు అక్కడ ఉన్న కాపు కులస్తుల ఓట్లు, రాజుల ఓట్లు చీలి రాజుల ఓట్లు పడక పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు అంట. అలాగే కడప గురించి చెబుతా ఆ నియోజవర్గం చాలా వరకు జగన్ మోహన్ రెడ్డి వైపు ఉన్న కొన్ని ప్రాంతాలు మాత్రం టీడీపీ కైవసం చేసుకుంటుందట. అలాంటి నియోజకవర్గం లో జమ్మలమడుగు ఒకటి అని చెప్పారు. ఇక కుప్పం విషయానికి వస్తే అక్కడి ఈసారి చంద్రబాబు నాయుడు గెలవడం అసాధ్యం అన్నారు.
దీనికి వివరణ ఇస్తూ తన సొంత జిల్లా అయిన చిత్తూర్ ను అభివృధి పథం వైపు నడిపించడం లో విఫలం అయ్యారని, అక్కడి ప్రజలు కనీస అభివృధి కూడా లేక విసిగిపోయారనీ అని గుర్తుచేశారు. ఇలా తన శైలిలో రాజకీయ విశ్లేషణ ఇచ్చారు.