షర్మిల .. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మీద రెచ్చిపోయింది. ఆడా మగా అనే తేడా లేదు ఒక రౌడీ అని చింతమనేనని షర్మిల విమర్శించారు. దెందలూరు నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలతో భేటీ అయిన షర్మిల.. ఎమ్మార్వో వనజాక్షిని జుట్టు పట్టుకొని రోడ్డు మీద ఈడ్చుకెళ్లాడు.. దరిద్రుడు కాదా వీడు.. అని ఆమె ఘాటైన వ్యాఖ్యలు చేశారు. చింతమనేని మనిషా పశువా అని ఆమె నిలదీశారు.

చింతమనేనికి మళ్లీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడాన్ని ఆమె తప్పుబట్టారు. ఈసారి చింతమనేనికి, చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పండని షర్మిల ప్రజలను కోరారు. చింతమనేనిపై 38 రౌడీషీట్లు ఉన్నాయట. మన ప్రభుత్వం వచ్చాక అవన్నీ బయటకు తీద్దాం అని షర్మిల చెప్పారు. మీరు ఓడించండి, ఆయనకు బుద్ధి వచ్చేట్టు మేం చూస్తామన్నారు. యథా రాజా తథా ప్రజా అన్నట్టుగా.. బాబు అలా ఉన్నాడు కాబట్టే.. చింతమనేని ఇలా ఉన్నారని ఆమె విమర్శించారు.

జగన్ అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికీ మేలు జరుగుతుందన్న షర్మిల.. కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారం వచ్చేలా చూస్తామన్నారు. అవసరమైతే మళ్లీ సర్వే చేస్తామని తెలిపారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే మీ అందరికీ మేలు జరుగుతుందని ఆమె చెప్పారు. అయితే ఈ ఎన్నికల్లో చింతమనేని ప్రభాకర్ ఓడిపోవటం ఖాయమని సర్వేలు తేల్చిచెబుతున్నాయి. బాబు .. ప్రభాకర్ మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం కూడా ప్రజలు ఆగ్రహానికి గురి చేస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: