ఇప్పటికే ప్రి - పోలింగ్ సర్వెలన్నీ ఆంధ్ర రాష్ట్రంలో ఈ సారి వైసీపీ గవర్నమెంట్ వస్తుందని తమ నివేదికలు వదిలేశాయి. ఇక బాబు హయాంలో నిరుద్యోగం, రైతులకు సరైన పంట నీరు అందకపోవడం టీడీపీ ప్రభుత్వానికి ప్రతికూలతలు గా మారిపోయాయి. ఇప్పుడు జగన్ ప్రకటించిన మేనిఫెస్టో కి సంబందించిన యాడ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


ఆ యాడ్ లో ఒక ముసలాయన తాను ఉద్యోగం మనేస్తున్నట్లు ఒక సెక్యూరిటీ గార్డుకి చెప్తాడు మొదట్లో. కారణం ఏమిటని అడుగగా, బాబు వస్తె జాబు వస్తుంది అని మాయమాటలు చెప్పారు అని, రైతుకు పంట నీరు వస్తుందని చెప్పి చివరికి కంట నీరు వస్తుందని వాపోయి కనిపించాడు.
ఆ తరువాత తన బిడ్డ జగన్ వస్తున్నాడనీ, ఇక తనకి బంగారు రోజులు మొదలయ్యాయి అని అన్నాడు. దాని తరువాత వచ్చే పాట, కనిపించే సీన్లు హైలెట్. ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి నీ


తరువాత జగన్ ను మార్చి మార్చి చూపించడం సరిగ్గా జనం నాడి పట్టిందని చెప్పాలి. నవరత్నాలు ఇప్పటికే మంచి ప్రజాదరణ పొందడంతో ఇలాంటి యాడ్ లు వైసీపీ గ్రాఫ్ ను ఆమాంతం పెంచేశాయి అనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: