బెంగళూరు రైల్వేస్టేషన్లో మతిస్తిమితం లేని ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. విద్యుత్ తీగలు పట్టుకుని చనిపోయాడు. అందరు చూస్తుండగా విద్యుత్ తీగలు పట్టుకుని మృతి చెందాడు. బెంగళూరు బెజిస్టిక్ రైల్వే స్టేషన్లో మతి స్థిమితం సరిగా లేని ఓ యువకుడు రైల్వే లైన్నుకు చెందిన విద్యుత్ తీగలను తాగా మృతి చెందాడు.
స్టేషన్లో ఓ రైలు ఆగివుంది. .అయితే సదరు వ్యక్తి ఆగివున్న రైలు ఎక్కాడు. ఆపై ఆత్మహత్య చేసుకుంటానంటూ అక్కడున్న ప్రయాణికులను బెదిరించాడు. ఈ క్రమంలో ఆ యువకుడిని కిందకు దించేందుకు అక్కడున్న వారు ప్రయత్నించారు.
అక్కడున్న వారు ఎంత ప్రయత్నించినా సదరు వ్యక్తి వినలేద కదా.. నేను చనిపోతాను అంటూ బెదించాడు. వారు ఎంత చెప్పిన వినలేదు ఆ వ్యక్తి.. ఈ క్రమంలోనే రైలు పైనున్న విద్యుత్ తీగలను తాకి అందరూ చూస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు. విద్యుత్ తీగలతో వచ్చిన షాక్తో క్షణాల్లోనే మాడి మశయిపోయాడు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నాడు. ఆ యువకుడు ఏపీ రాష్ట్రానికి చెందిన వాసిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.