ఏపీలో ఎవరు సీఎం ఈ విషయం ఇపుడు రాజకీయ పార్టీలు బెట్టింగ్ రాయుళ్ళ్ళు, సర్వేశ్వరుల నుంచి జ్యోతీష్యం చెప్పే వారి వరకూ తెగ హీట్ పుట్టించేస్తోంది. ఏపీలో ఈసారి ఎన్నికలు అలా జరిగాయి మరి. సీఎం ఎవరు అవుతారు అన్నది అతి పెద్ద సస్పెన్స్ గా మారింది. జనాల్లో ఎవరికి వేవ్ ఉందన్నది కూడా తేలలేదు. దాంతో అంతా కిందా మీదా అవుతున్నారు.


ఇదిలా ఉండగా ఏపీలో కచ్చితంగా చంద్రబాబే సీఎం అవుతారని ముఖ వాస్తు, జ్యోతిష్య, మంత్ర శాస్త్రనిపుణుడు నైషధం శివరామశాస్త్రి పేర్కొన్నారు . మెుత్తం 112 సీట్లలో టీడీపీ విజయం సాధించడం ఖాయమని మళ్లీ సీఎం పీఠం చంద్రబాబుదేనన్నారు శివరామ శాస్త్రి . ఇక ఆ విషయాన్ని తాను రూ.100 బాండ్ పేపర్ మీద రాసివ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఈ విషయంలో తన జ్యోతీష్యం తప్పదని కూడా అయన ధీమాగా చెబుతున్నారు.


అదే సమయంలో వైసీపీకి 58 సీట్లు కంటే ఎక్కువ రావని, విజయవాడ సెంట్రల్లో మల్లాది విష్ణు ఓడిపోతారని, అక్కడ బోండా ఉమ గెలుస్తారని కూడా చెప్పుకొచ్చారు. ఇక జనసేన పవన్ పార్టీకి కేవలం 5 సీట్లు మాత్రమే వస్తాయని సివరామశాస్త్రి చెప్పారు. పవన్ భీమవరంలో ఓడిపోతారని, అయితే గాజువాకలో మాత్రం 57, 600 ఓట్ల భారీ మెజారిటీతో గెలుస్తారని కూడా అయన జోస్యం చెప్పారు. ఓ టీవీ చానల్లో ఆయన చెప్పిన ఈ విషయాలు ఇపుడు సంచనలం రేకెత్తిస్తున్నాయి. ఏపీలో బాబు మళ్ళీ సీఎం అవకపోతే రాను మొత్తం జ్యోతీష్యాన్నే వదిలేస్తానంటున్న శాస్త్రి గారి అతి ధీమా ఇపుడు అన్ని పార్టీలో చర్చగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: