రానురాను వివాహేత సంబంధాలు అధికమవుతున్నాయి. ఎందుకో తెలియదు.. కానీ పెళ్లైన కొన్నాళ్లకే భర్త వేరే మహిళతో ఎఫైర్ పెట్టుకోవడం.. లేదా వేరే వ్యక్తులతో భార్యలు ఎఫైర్ పెట్టుకోవడం.. లేదా సహజీవనం చేయడం.. ఇలా ఒకటేంటీ మనకు కనిపించని దారుణాలు చాలా జరుగుతున్నాయి.. అప్పుడప్పుడు కొన్ని ఆలస్యంగా వెలుచూస్తున్నాయి. వివాహేతర సంబంధంతో ఒకరిపై ఒకరు నరుక్కు చస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా గుడివాడ పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం హత్యాయత్నానికి దారి తీసింది. వాంబేకాలనీలో ఉంటున్న కోనూరు మురళీ కృష్ణ కుటుంబ కలహాలతో భార్యకు కొన్నాళ్లుగా దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మురళీ కృష్ణ భార్య ఎ.కొండూరు మండలం మీమలపాడు గ్రామానికి చెందిన ఉగ్గా గోకరాజుతో సహజీవనం చేస్తోంది.
అయితే భార్యతో గోకరాజు ఉండటాన్ని గుర్తించిన మురళీకృష్ణ.. ఒక్కసారిగా కత్తితో అతడిపై దాడి చేశాడు. విచక్షణారహితంగా గాయపర్చాడు. దాడిలో గోకరాజు చెస్ట్, కంటిపై తీవ్ర గాయాలయ్యాయి. తేరుకున్న అంతలోనే అప్రమత్తమైన భార్య తన భర్త కళ్లల్లో కారం చల్లి ప్రియుడితో కలిసి జంప్ అయ్యింది.
మురళీకృష్ణ గోకరాజుకు చెందిన కొత్త పల్సర్ బైక్కు నిప్పుపెట్టి కాల్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. చికిత్స నిమిత్తం బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.