మాకొద్దీ మొగుడు బాబోయి అని దేశంలోని కొంతమంది రాజకీయ నాయకులు అనుకున్నారు. కానీ మోడీ అయితే అవినీతిపరులకు కరెక్ట్ మొగుడంటూ జనాలు ఓటు చేశారు. దాంతో మళ్ళీ మోడీ ప్రధాని కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ రోజు విడుదల అయిన ఎగ్టిట్ పోల్స్ అదే విషయాన్ని స్పష్టం చేశాయి. మోడీ మళ్ళీ ప్రధాని అయితే కనుక అయిదేళ్ళు  దేశాన్ని పాలించి వరసగా రెండవమారు అధికారంలోకి వచ్చిన కాంగ్రేసేతర తొలి ప్రధాని అవుతారు.


ఇక మోడీ వద్దు అంటూ గత ఏడాదిగా దేశాటనం  చేస్తున్న చంద్రబాబుకు ఎగ్టిట్ పోల్స్ షాక్ మామూలుగా ఉండదేమో. అలా ఇలా కాకుండా ఆయనకు ఇది రాజకీయంగా పెద్ద దెబ్బే అవుతుదని అంటున్నారు. ఓ వైపు ఎగ్టిట్ పోల్స్ అన్నీ ఏపీలో బాబు అధికారం పోతుందని ఒకే గొంతుతో చెప్పేశాయి. అక్కడ మోడీ మళ్ళీ వచ్చేస్తున్నాడు.


మరి చూసుకోవాలి బాబు గారి బాధ. అదే నిజమైతే అలా ఇలా ఉండడు, ఇక్కడ చంద్రబాబు, అక్కడ రాహుల్ బాబు అనుకుంటూ టీడీపీ నేతలు హాయిగా గడిపేస్తున్నారు. ఇపుడు ఎగ్టిట్  పోల్ వల్ల అక్కడా ఇక్కడా తేడా కొట్టేస్తే రేపటి రోజున ఎలా అన్నది తమ్ముళ్లకు పెద్ద బెంగే మరి. మొత్తానికి బాబు యాంటీ మోడీ క్యాంప్ రాజకీయాలు చేస్తూ  ఢిల్లీ టూర్లో బిజీగా ఉండగా ఎగ్టిట్  పోల్స్ మాత్రం అపశకునం పలుకుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: