గుంటూరు జిల్లాలో ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. దాచేప‌ల్లి మండ‌లం శ్రీనివాస‌పురంలో వైసీపీ, టీడీపీ వ‌ర్గీయుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. ఇరువ‌ర్గాలు ప‌ర‌స్ప‌రం దాడులు చేసుకున్నారు. ఒక‌రిపై ఒకరు ఇష్ట‌మొచ్చిన‌ట్టు కొట్టుకున్నారు. 


క‌ర్ర‌లు, గొడ్డ‌లితో స‌హా చేతికి ఏది దొరికితే అది పట్టుకుని దాడులు చేసుకున్నారు. విచ‌క్ష‌ణార‌హితంగా ఫైట్ చేసుకున్నారు. ఇక‌ స‌మాచారం అందుకున్న పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. ఇరు వ‌ర్గాల వారిని చెద‌ర‌గొట్టి ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చారు. 


ఇరువర్గాల మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో ప‌లువురికి గాయాల‌య్యాయి. వారిని ఆస్పిత్రికి త‌ర‌లించారు. అనంత‌రం గొడ‌వ‌కు పాల్ప‌డ్డ వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస‌పురం గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. భారీ పోలీసుల‌ను మోహ‌రించారు. దీంతో ఆ ప్రాంతంలో మొత్తం టెన్షన్ వాతావ‌రం నేల‌కొంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: