వైఎస్ జగన్ పాలన తీరుపై ఇప్పటికే అంతటా పాజిటివ్ వేవ్ ఏర్పడింది. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూనే వరస సమీక్షలతో తనదైన ముద్ర వేశారు. ఇక జగన్ ఆలోచనలు, వేస్తున్న అడుగులు చూసిన తరువాత అనుకూల మీడియా సైతం జగన్ని మెచ్చుకోకతప్పేట్లులేదు.
ఇదిలా ఉండగా జగన్ గురించి, ఆయన మంత్రివర్గం గురించి విపక్షాలు సైతం వేలు పెట్టలేని విధంగా కూర్పు ఉంది. దాంతో అన్ని చోట్ల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ జగన్ మంత్రివర్గం భేష్ అంటూ కితాబు ఇచ్చారు. బడుగు బలహీన వర్గాలకూ అవకాశం ఇవ్వడం ద్వారా జగన్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు.
ఇక టీడీపీ నుంచి కూడా జగన్ కు ప్రశంసలు దక్కడం గొప్ప విషయం. ఆ పార్టీలో కీలకనేత, సీనియర్ మోస్ట్ లీడర్ అయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ జగన్ మంత్రివర్గం బాగుందని కితాబు ఇచ్చారు. ఇది నిజంగా గ్రేట్ అనుకోవాలి. ఉప్పూ నిప్పులా ఉండే టీడీపీ వైసీపీని అందునా జగన్ని మెచ్చుకోవడం అంటే జగన్ మార్కులు బాగా పెరిగినట్లే.
ఇక జగన్ అమలు చేస్తున్న కార్యక్రమాలు బాగున్నాయని, అయితే అవి టీడీపీ సంక్షేమ కార్యక్రమాలుగా ఆయన చెప్పడమే కొసమెరుపు. మొత్తానికి జగన్ పాలనా బాగుంది, మంత్రివర్గం బాగుంది. ఇదీ పసుపు తమ్ముళ్ళు చెబుతున్న మాట. నోట్ దిస్ పాయింట్.