నెల రోజులు కూడా కాలేదు. అపుడే వైసీపీ సర్కార్ ని ఆడిపోసుకునే పనిలో టీడీపీ పడిపోయింది. తాము ఏపీ అభివ్రుధ్ధి కోసం ఎంతో చేశామని, ఎన్నో కట్టడాలు నిర్మించామని టీడీపీ తమ్ముళ్ళు గొప్పలు  చెబుతున్నారు. తాము చేసిన అభివ్రుధ్ధిని చూడలేక కట్టిన వాటిని అడ్డంగా  కూలగొడుతున్నారని వితండ వాదనలు లేవదీస్తున్నారు.


ఇక ప్రజావేదిక అక్రమ నిర్మాణం అన్నది తెలిసి కూడా బుకాయిస్తున్న టీడీపీ నేతలు కూల్చివేతను మహా పాపంగా చిత్రీకరిస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చి గట్టిగా నెల దాటలేదు కానీ ఆయన మీద విద్వంస‌కారుడు అన్న ముద్ర వేసేందుకు రెడీ అయిపోతున్నారు. తాము ఎంతో కష్టపడి ఒక్కోటీ కడితే జగన్ వాటిని అయిదు నిముషాల్లో కూల్చేస్తున్నాడని కొత్త ఆరోపణలు చేస్తున్నారు.  ఎంపీ కేశినేని నాని,  సీనియర్ నేత యనమల రామక్రిష్ణుడు,  వర్ల రామయ్య, వైవీ రాజేంద్రప్రసాద్ లాంటి నేతలైతే కక్ష పూరితంగా జగన్ వ్యవహరిస్తున్నారని అంటున్నారు.


పిచ్చోడి చేతిలో రాయిలా జగన్ కి అధికారం దక్కిందని విమర్శలు చేస్తున్నారు. టీడీపీ అనుకూల మీడియా కూడా జగన్ ప్రజావేదికను కూల్చడాన్ని ఆంధ్ర జాతికి కలిగిన అతి భారీ నష్టంగా పదే పదే చెబుతూ కధనాలు వండి వారుస్తోంది. మరి ఒక్క అక్రమ కట్టడానికే ఇలా అయిపోతే రానున్న రోజుల్లో కరకట్ట మీదున్న అక్రమ నిర్మాణాలు వైసీపీ సర్కార్ కూలిస్తే టీడీపీ ఏమైపోతుందో. జగన్ని ఏకంగా ఏ విదేశీ దండయాత్రికుడిగా చిత్రీకరిస్తుందేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: