ఇప్పటి వరకు తెలంగాణలో అమలవుతున్న కళ్యాణ లక్ష్మి గురించి మీకు తెలుసు. కానీ దేశవ్యాప్తంగా అమలవుతున్న కళ్యాణ లక్ష్మి గురించి ఇపుడు తెలుసుకోండి. పేదల కోసం ఒక అద్భుత బీమా పథకం ఇది... !!

ప్రభుత్వ ఉద్యోగులు తప్ప, కూలీలతో పాటు అందరు లబ్దిదారులే. తెల్ల రేషన్‌ కార్డు తప్పని సరిగాఉండాలి. ఏడాదికి రూ 22 మాత్రమే ఖర్చు, అవగాహన పెంచుకొని, అందరికీ ఈ సమాచారం చేరేలా చేయండి.

మీకు ఉండాల్సిన అర్హతలు

1) 18 నుండి 55 ఉన్న స్త్రీ , పురుషులు అర్హులు 2) ప్రభుత్వ ఉద్యోగులు తప్ప ఎలాంటి కూలీలైన,ఇతరులైన ఇందులో చేరవచ్చు.

3) రేషన్‌ కార్డు,ఆధార్‌ కార్డు,జిరాక్స్‌ జత చేయాలి 4) బ్యాంకు చలానా జత చేసి లేబర్‌ ఆఫీస్‌ లో ఇవ్వాలి.

ఇవీ ప్రయోజనాలు

1, పాలసీదారు సహజ మరణం పొందితే రూ.1,30,000/-ల ఇన్సూరెన్స్‌

2.అలాగే ప్రమాద వశాత్తూ మరణం వల్ల రూ.2,00000/-

3, ఒక ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు వుంటే ఒకొక్కరికి వివాహ నజరానాగా 30,000/-రూ సాయం.

4, ప్రసవ కానుకగా రెండు ప్రసవాలకు 30,000/-రూ. చొప్పున వచ్చే అవకాశం ఉంది.

5, పాలసీ పొందిన తరువాత లబ్ధిదారునికి ప్రమాదం జరిగి 50% వికలాంగులుగా ఉంటే 2.50 లక్షలు, అదే 100% ఉంటే 5 లక్షల పరిహారం పొందే అవకాశం ఉంది.

ఈ లేబర్‌ ఇన్సూరెన్స్‌ ఒకసారి 110/-రూ .చెల్లిస్తే 5 సంవత్సరాల వరకు చెల్లించనక్కర్లేదు.అంటే మీరు చెల్లించేది సంవత్సరానికి 22/-రూపాయలు మాత్రమే!! వెంటనే మీరు,మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులందరిని చేర్పించండి. ఇలాంటి ప్రయోజనాలు ప్రతి కుటుంబానికి అత్యంత అవసరమైనవి. వెంటనే మీ మండలంలోని కార్మిక అధికారిని(లేబర్‌ ఆఫీసర్‌) సంప్రదించండి.

చివరగా ఒక్క మాట ఈ పథకంలోకి చాలా మంది.... కార్మికులు మాత్రమే చేరవచ్చని అనుకుంటారు. అది కానే కాదు. తెల్ల రేషన్‌ కార్డు వున్న ప్రతి కుటుంబం ఈ పథకానికి అర్హులే...

ఇది చదివిన వారు , మీ చుట్టూ ఉన్న,సామాన్య ప్రజలకు తెలియ చేయండి. ప్రభుత్వాలు ఇలాంటి పథకాలకు సరైన ప్రచారం ఇవ్వక పోవడం వల్ల జనంలోకి వెళ్లడం లేదు. మన వంతు సామాజిక బాధ్యతగా అందరికీ షేర్‌ చేయండి, పేద కుటుంబాలకు చేయూతనిచ్చిన వారు అవుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: