ఆగస్టు 16 శుక్రవారం కాశ్మీర్ పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యుఎన్ఎస్సి) “క్లోజ్డ్ కన్సల్టేషన్” సమావేశం నిర్వహించింది. ఆగస్టు 5 న, భారతదేశం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ప్రత్యేక హోదాను ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A ను తీసేసింది, దీనిని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చారు జె&కె మరియు లడఖ్. వెనువెంటనే లోయను లాక్డౌన్ చేశారు, జమ్ము ప్రధాన రాజకీయ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం జరిగిన యుఎన్ఎస్సి సమావేశానికి భారత్, పాకిస్తాన్ రెండింటినీ దూరంగా ఉంచారు. చివరిసారిగా ‘ఇండియా-పాకిస్తాన్ ’ సమస్యను యుఎన్ఎస్సి 1971 డిసెంబర్లో భారత్, పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొని బంగ్లాదేశ్ దేశం సృష్టికి దారితీసినప్పుడు పాల్గొన్నాయి. కాశ్మీర్ పశ్చిమ సరిహద్దులలో భారత మరియు పాకిస్తాన్ దళాలు ఘర్షణ పడినప్పుడు 1965 యుద్ధంలో కూడా ఒక సా చర్చించబడింది. గత సోమవారం ఆర్టికల్ 370 ను రద్దు చేసిన తరువాత, పాకిస్తాన్ యుఎన్ఎస్సికి లేఖ రాసింది. యుఎన్ఎస్సిలో శాశ్వత సభ్యుడు, పాకిస్తాన్ మిత్రపక్షమైన చైనా కాశ్మీర్లో జరుగుతున్న పరిణామాలపై చర్చించడానికి యుఎన్ఎస్సి సమావేశాన్ని కోరింది.
ఆ సమావేశం తరువాత యుఎన్ఎస్సి ఒక ప్రకటన విడుదల చేయలేదు, కాని సమావేశం తరువాత ఆర్టికల్ 370 చుట్టూ సమస్యలు కాశ్మీర్ కు ప్రత్యేక హోదా అంతర్గత విషయం అని భారతదేశం గట్టిగా చెప్పింది. పాకిస్తాన్ మరియు చైనా సమావేశానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాయని ఐరాసలోని భారత రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ ఆరోపించారు. గతంలో రాచరిక రాష్ట్రమైన కాశ్మీర్ లో 1940 ల చివరలో యుఎన్ఎస్సి తీర్మానం 47 సహా ప్రజాభిప్రాయ సేకరణను సిఫారసు చేయడంతో సహా కీలకమైన ఐక్యరాజ్యసమితి తీర్మానాలను పోలి కాశ్మీర్ లోయలో ఉన్న పరిస్థితి ఉన్నదా అని ఇప్పుదు ఐరాసా కి ఉన్న ప్రశ్న?
యుఎన్ఎ వద్ద కాశ్మీర్ సమస్య 1948 జనవరి 1 న మొదటి సారి చర్చించారు, పాకిస్తాన్ అవకతవకలు, గిరిజనుల ను పంపడం, సైనికులను కాశ్మీర్లోకి పంపినప్పుడు మూడు నెలల ముందు చెలరేగిన సంఘర్షణపై చర్చించాలని భారతదేశం యుఎన్ఎస్సిని కోరింది. స్థానిక జనాభా, మౌలిక సదుపాయాలపై అవకతవకలు, పాకిస్తాన్ జరిపిన హింసను వివరించే దిశగా భారతదేశం యుఎన్ఎస్సి వద్ద పెర్కొన్న విషయాలు "జమ్మూ కాశ్మీర్ సమస్యగా" మారింది. దానిని జనవరి 22, 1948 న “ది ఇండియా-పాకిస్తాన్ సమస్య” గా మార్చారు. అప్పటి నుండి 1971 వరకు, ఈ అంశం యుఎన్ఎస్సి లో ముఖ్యంగా ఇరు దేశాలు ఘర్షణ పడినప్పుడు ప్రముఖంగా కనిపించేది.
జనవరి 20 1948 న తీర్మానం 39 ప్రకారం యుఎన్ఎస్సి భారతదేశం, పాకిస్తాన్ కోసం ముగ్గురు సభ్యుల UN కమిషన్ (UNCIP) ను ఏర్పాటు చేసింది. కమిషన్ కార్యరూపం దాల్చడంలో భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య విభేదాలు మొదటి వైఫల్యానికి దారితీశాయి. ఈ కమిషన్ చివరకు ఐదుగురు సభ్యులతో ఏప్రిల్ 21, 1948 న పునర్నిర్మించబడింది. కాశ్మీర్ రాష్ట్రంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగేలా ఒక యంత్రాంగాన్ని ప్లాన్ చేయాలని ఆదేశించబడింది. (ఇది యుఎన్ఎస్సి తీర్మానం 47 లో భాగం). ఈ తేదీన ఆమోదించిన యుఎన్ఎస్సి తీర్మానం 47 శాంతిభద్రతల పునరుద్ధరణ తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని భారత్, పాకిస్థాన్లను కోరారు. UNCIP జనవరి 5 1949 న ఒక తీర్మానాన్ని ఆమోదించింది, ఇది కాశ్మీర్లో "ఉచిత మరియు నిష్పాక్షిక ప్రజాభిప్రాయ సేకరణ" నిర్వహించడానికి ఒక యంత్రాంగాన్ని అందించింది.ఆ సమయంలో, యునైటెడ్ కింగ్డమ్ ప్రభావంతో యుఎన్ఎస్సి, కాశ్మీర్ లో ప్రారంభ గిరిజన దాడిలో పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతం నుండి వైదొలిగి మొదట కాల్పుల విరమణ ప్రతిపాదనకు అంగీకరించడంతో పాకిస్తాన్ పైచేయి సాధించింది.
ఇప్పుడు సమస్యకి సభలో చాలామంది భారతదేశం మరియు పాకిస్తాన్లను ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలని కోరారు , పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి చైనా మద్దతుతో ఐరాసకు వెళ్లారు, కాని నియంత్రణ రేఖపై పెరిగిన సైనిక ఉద్రిక్తత మరియు ఇరువైపుల భూ పరిస్థితి, కాశ్మీర్పై యుఎన్ఎస్సి తన ముందస్తు తీర్మానాలను ఒప్పుకున్న పరిస్థితులు లేవు. ఐరాస ఆధ్వర్యంలో ఈ అంశంపై చర్చించడం పలు కారణాల వల్ల కష్టమవుతుంది. మొదటిది ఇరు దేశాలు (భారతదేశం మరియు పాకిస్తాన్) తమ నియంత్రణలో ఉన్న భూభాగాలను తమ రాష్ట్రాల యూనియన్లోకి తీసుకునే ప్రక్రియను కొనసాగించాయి. రెండవది, ద్వైపాక్షికంగా దీనిని ఎదుర్కోవటానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. కావున తాము ఈ సమస్యని పరిష్కరించడం కష్టమవుతుంది అని యుఎన్ఎస్సి తెలిపింది.