తెలంగాణ ప్ర‌జ‌లు రాబోయే రోజుల్లో అద్భుతాన్ని చూడ‌బోతున్నార‌ని ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర్ రావు వ్యాఖ్యానించారు.  కొన్ని కారణాల వల్ల, గత పాలకుల తెలివితక్కువ విధానాల వల్ల తెలంగాణకు నష్టం జరిగిందని.. కొంతమంది తెలివిలేని సన్నాసులు రాష్ట్రానికి ఏమీ చేయలేదని సీఎం కేసీఆర్ విమర్శించారు. ఈ స‌మ‌స్య‌ల‌కు త్వ‌ర‌లో ప‌రిష్కారం దొర‌క‌నుంద‌న్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప‌రిశీలించిన కేసీఆర్  వనపర్తిలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్ లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..కొన్ని ప్రగతి నిరోధక శక్తుల వల్ల ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైందని సీఎం కేసీఆర్ అన్నారు.


ఉమ్మడి పాలమూరు జిల్లా పర్యటనలో భాగంగా కేసీఆర్ పనులను హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన అధికారులు, సంబంధిత ఏజెన్సీ ల ప్రతినిధులతో ప్రాజెక్టు పనులకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులలో మరింత వేగం పెంచడానికి ప్రస్తుతం ఒక షిఫ్ట్ ద్వారా పనులను కొనసాగిస్తున్నందున 3 మూడు షిఫ్టులతో పనులు నిర్వహించాలని ఆరు నెలల్లోగా పూర్తి చేయడానికి ఏజెన్సీలు, అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఆయన ఆదేశించారు. 


జూరాల నుంచి పాలమూరు ఎత్తిపోతలకు నీళ్లు తీసుకోవచ్చని కొందరు నేతలు మాట్లాడుతున్నారని, జూరాల సామర్థ్యం ఎంత, తాము నిర్మిస్తోన్న పాలమూరు ఎత్తిపోతల కెపాసిటీ ఎంతో అవగాహన లేకుండా కామెంట్స్ చేయడం ఏంటని కేసీఆర్ మండిపడ్డారు. గత పాలకుల అసమర్థత వల్ల తెలంగాణకు అన్యాయం జరిగిందని కేసీఆర్ మండిప‌డ్డారు. నదుల అనుసంధానంపై ఇరురాష్ట్రాలు తగిన రీతిలో అగ్రిమెంట్ చేసుకుంటాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోవడం వల్ల 570 టీఎంసీల నీళ్లు వాడుకోవడానికి వెసులుబాటు కలిగిందన్నారు.  ``మంచినీళ్ల కోసం మనం అనేకసార్లు కర్ణాటకను బతిమాలాం. దీనికి గోదావరిని కృష్ణాతో అనుసంధానం చేసుకోవడం ఒక్కటే మార్గం. నదుల అనుసంధానంపై ఏపీ సీఎం, నేను ఒక అభిప్రాయానికి వచ్చాం. `అని సీఎం కేసీఆర్ తెలిపారు. 


చంద్రబాబు నాయుడు కుంచిత మనస్తత్వంతో మాట్లాడుతున్నాడని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. గతంలో ఇదే చంద్రబాబు బాబ్లీ మీద గొడవపెట్టుకుని ఏమి సాధించలేదన్నారు. పరవాడ ప్రాజెక్టులతో గొడవపెట్టుకున్న చంద్రబాబు సాధించింది సున్నానని సీఎం ఎద్దేవా చేశారు. ఎక్కడ ప్రాజెక్టు కట్టినా గొడవ చేసి హంగామా క్రియేట్ చేశారన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: