ఇన్ని రోజులు కాశ్మీర్ విషయం మీద పాకిస్థాన్ .. భారత్ ను ఇబ్బంది పెట్టే విధంగా ఎన్నో వ్యాఖ్యలు చేసేది. కాశ్మీర్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగం కాదని ఎప్పటికైనా తాము చేజిక్కించుకుంటామని పాక్ కలలు కనింది. కానీ మోడీ ప్రభుత్వం ఒక్క దెబ్బతో కాశ్మీర్ ను భారత్ లో కలిపేసుకుంది. దీనితో భారత్ తమ నెక్స్ట్ టార్గెట్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ అని తేల్చి చెప్పింది. ఇప్పుడు ఇదే విషయం పాక్ ను ఖంగారు పెట్టిస్తుంది. ఇన్ని రోజులు కాశ్మీర్ కు స్వయం ప్రతి పత్తి ఉండటంతో పాక్ చాలా ఆటలు ఆడింది. కానీ ఇప్పుడు పీఓకే ను పాక్ కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ మాత్రం తేడా జరిగిన భారత్ .. పీఓకేను భారత్ లో కలిపేసుకుంటుందని పాక్ కు బాగా తెలుసు. 


అయితే కాశ్మీర్ విషయంలో ఐరాస పట్టించుకోకపోవడంతో . .పైగా ఇది భారత్ అంతర్గత వ్యవహారమని తేల్చి చెప్పడంతో పాక్ ఎక్కడ లేని అసహనానికి గురవుతోంది. అందుకే విచక్షణ కోల్పోయి రాబోయే రోజుల్లో భారత్ తో పూర్తి స్థాయి యుద్ధం తప్పదని పిచ్చి కూతలు కూస్తుంది. మా దగ్గర అను బాంబులు ఉన్నాయి అంటూ ఇమ్రాన్ ఖాన్ పిచ్చోడి మాదిరిగా మాట్లాడుతున్నారు. దీనితో పాకిస్థాన్ అంతర్జాతీయ సమాజంలో ఏకాకిలా మారింది. 


కాశ్మీర్ కు ఉన్న స్వయం ప్రతిపత్తిని కేంద్రం తొలిగించి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేసి, భారత్ తన భూ భాగంలో కలిపేసుకుంది. దీనితో పాకిస్థాన్ ఎక్కడ లేని ఆందోళనకు గురైంది. కొన్ని రోజుల క్రితం ఇమ్రాన్ ఖాన్ అమెరికాకు వెళ్లి ట్రంప్ తో మాట్లాడి కాశ్మీర్ విషయాన్ని రెచ్చగొట్టానని చాలా అనందం పడ్డారు. ట్రంప్ కూడా నేను మధ్య వర్తిత్వం చేస్తానని చెప్పడంతో ఇమ్రాన్ ఖాన్ చాలా సంతోష పడ్డారు. ఎప్పటికైనా కాశ్మీర్ ను తాము దక్కించుకుంటామని పాకిస్థాన్ అనుకుంటూ వచ్చింది. అయితే నరేంద్ర మోడీ ఇమ్రాన్ ఎత్తులకు పై ఎత్తు వేసి అస్సలు కాశ్మీర్ కు ఉన్న అధికారాలను తొలిగించి ఏకంగా భారత్ లో కలిపేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: