కశ్మీర్ లో జరిగిన ఆర్టికల్ 370 రద్దు అనంతరం పాకిస్తాన్ భారత్ పై కసితో రగిలిపోతోంది. భారత్ ను ఏదో ఒకటి చేసేయాలని చూస్తోంది. దీని కోసం టెర్రరిస్టుల సాయం తీసుకుంటుంది. అయితే పాక్ కుట్రలను ఎప్పటికప్పుడు ఛేదిస్తోంది. భారత్ ఉగ్రవాద చొరబాట్లను తిప్పికొడుతుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి భారత్ భూభాగంలోకి చొరబడుతున్న ఉగ్రవాదులను మట్టుబెట్టింది భారత్ ఆర్మీ. పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని టెర్రర్ లాంచ్ పాడ్ లను పాక్ శిబిరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది.


పాక్ సైనిక శిబిరాలకు చేరువుగా ఉన్న ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్స్ ను నిర్వీర్యం చేసింది. లీపా వాలాలోని ఉగ్ర శిబిరాలను భారత సేనలు ధ్వంసం చేసాయి. పాకిస్థాన్ సేనలు భారత్ లోకి ఉగ్రవాదులను చొప్పించేందుకు ఈ శిబిరాలను వాడుకుంటున్నాయి. పాక్ సేనల సహకారంతో జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తోయిబా వంటి పలు ఉగ్రవాద సంస్థలు ఈ ప్రాంతంలో శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేశాయి. ఈ శిబిరాల్లో ఉగ్రవాదులకు భారత్ లో ఉగ్ర దాడులతో పాటు భారత సైన్యం కన్నుగప్పి చొరబాట్లకు ఎలా పాల్పడవచ్చనే అంశాల పై ట్రైనింగ్ ఇస్తారు .



మరోవైపు అంతర్జాతీయ ఉగ్రవాది అజర్ ని మూడో కంటికి తెలియకుండా రహస్యంగా జైలు నుంచి విడుదల చేసింది పాక్ ప్రభుత్వం . అతడితో కలిసి భారత్ పై దాడులకు ప్లాన్ చేస్తోంది . అజార్ ప్రస్తుతం పాక్ జైల్లో లేడని భగల్ పూర్ లో జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయంలో ఉన్నట్టుగా భారత ఇంటెలిజెన్స్ కు సమాచారం అందింది. భారత్ పై ఉగ్ర దాడులు చేసి కల్లోలం సృష్టించాలని వీరి ప్లాన్. ఇందులో భాగంగానే సీమాంతర ఉగ్రవాదాలను ప్రోత్సహిస్తోంది పాక్ ఆర్మీ.

మరింత సమాచారం తెలుసుకోండి: