టిడిపి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా చంద్రబాబు ఐదేళ్ల పాలనలో విమర్శల వర్షం కురిపించారు. పచ్చ దొంగలకు అమరావతి తప్ప ఇంకేమి పట్టదని లక్షల కోట్ల రియల్ ఎస్టేట్ రాబడుల గురించే వారి ధ్యాసంతా అని ఆరోపించారు. అందుకే ఏదో ఒక కృత్రిమ సమస్యని సృష్టించి అనుకూల మీడియాతో అలజడి రేపాలని చూస్తున్నారని విజయ సాయి విమర్శించారు.



ఐదేళ్ల పాలనలో వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి పోలీసులకు పచ్చ యూనిఫాం తొలగించారని ఘాటుగా కామెంట్ చేశారు. ఇప్పుడు పోలీసులు స్వేచ్ఛగా పని చేస్తున్నారని డౌటుంటే శాంపిల్ గా కోడెల కుటుంబం పై కేసులు సీబీఐకి అప్పగించమని అడగొచ్చు అని చంద్రబాబు గారూ అంటూ ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: