టీడీపీ సీనియర్‌ నేత, మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఈరోజు కన్నుమూశారు. కోడెల శివ ప్రసాద్ ఈరోజు మధ్యాహ్నం తన నివాసంలోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయాన్నీ గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన బసవతారకం ఆస్పత్రికి తరలించారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూనే ఆయన మృతి చెందినట్టు తెలిసింది.                             


గత కొంతకాలంగా అవినీతి ఆరోపణలతో సతమతమవుతున్న ఆయన.. గత నెల 23న గుండెపోటుకు గురయ్యారు. కాగా కోడెల శివ ప్రసాద్ మృతిపట్ల తీవ్ర ద్రిగ్భాంత్రికి గురయ్యాడు కేశినేని నాని. ఈ నేపథ్యంలోనే అతిని ట్విట్టర్ ఖాతా ద్వారా కోడెల శివ ప్రసాద్ కి సంతాపం తెలిపారు. 


కేశినేని నాని ట్విట్టర్ సంతాపం తెలియజేస్తూ 'కోడెల శివ ప్రసాద రావు గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని మనస్పూర్తిగా వేడుకుంటున్నాను.' అంటూ ట్విట్ చేశారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ టీడీపీ నేతలు అందరూ అయన ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం తెలియజేస్తున్నారు. కాగా కోడెల శివ ప్రసాద్ మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.                                                                


మరింత సమాచారం తెలుసుకోండి: