డబ్బు..డబ్బు..డబ్బు.. ఈ లోకాన్ని నడిపించేది అదే అన్నట్లు కొంత మంది డబ్బు కోసం ఎంత నీచమైన పనికైనా సిద్దమవుతున్నారు. ముఖ్యంగా ఆడవాళ్ల శీలాను ఫణంగా పెట్టి డబ్బులు వసూళ్లు చేయడం ఈ మద్య కామన్ అయ్యింది. కొంత మంది లగ్జరీ జీవితాలకు అలావటు పడ్డ ఆడవారి బలహీనతలు క్యాష్ చేసుకుంటూ తాము కోట్లు సంపాదిస్తున్నారు. 

చిన్నా పెద్ద పట్టణాలే అనే తేడా లేకుండా అపార్ట్ మెంట్స్, బ్యూటీపార్లర్లు అడ్డగా చేసుకొని హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తూ కోట్లు దండుకుంటున్నారు. అయితే ఇలాంటి వారికి ఓ వైపు పోలీస్, పొలిటికల్ సపోర్ట్ ఉండటంతో విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు.  కొన్ని సార్లు పోలీసులు రైడ్ చేసినపుడు పట్టుబడటం వెంటనే కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకొని మళ్లీ ఇదే దందా చేయడం కామన్ అయ్యింది. తాజాగా ఢిల్లీలోని మసాజ్ పార్లర్లలో గుట్టుగా సాగుతున్న వ్యభిచార దందాను మహిళా కమిషన్ రట్టు చేసింది.

అక్కడ కొంత మంది బాధిత అమ్మాయిలను రక్షించింది.  కాగా, ఈరైడ్ తర్వాత  విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. అమ్మాయిలను, కండోమ్స్ కి ఒక కార్డుద్వారా ధరలు నిర్ణయిస్తారట. ఈ నేపథ్యంలో అక్కడ పెద్ద మొత్తంలో కండోములతోపాటు అమ్మాయిల ధరలను నిర్ణయిస్తూ ఏర్పాటు చేసిన కార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  అంతే కాదు అక్కడకు వచ్చిన విటులకు యువతుల నగ్నచిత్రాలపై రేట్లను వేయడం చూసి  మహిళా కమిషన్ సభ్యులు విస్తుపోయారు. నిర్వాహకులపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: