చిరంజీవి సినీ కెరియర్ లోనే మొట్టమొదటి చారిత్రాత్మక చిత్రంగా విడుదలైన సినిమా సైరా నర్సింహారెడ్డి సినిమా తాజాగా విడుదలై మంచి టాక్ తో దూసుకుపోతుంది. వసూళ్లు కూడా బాగా రాబడుతుంది. అయితే ఈ సినిమా విడుదల అయినప్పటి నుంచి చిరంజీవి తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులను కలుస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ ని కూడా కలిశారు మెగాస్టార్. సైరా సినిమాను చూసిన తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ చిరంజీవిని అభినందించారు.అదే సైరా సినిమా విడుదల అయినప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు అపాయింట్ మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి . అయితే ఈ నెల 11న జగన్ చిరంజీవి కి అపాయింట్మెంట్ ఇచ్చారు అని వార్తలు రాగా ఆ తర్వాత అవన్నీ వాస్తవం కాదని తెలిసింది.
కాగా ఈ నెల 14న చిరంజీవికి జగన్ అపాయింట్మెంట్ ఇచ్చారని సమాచారం.ఇదిలా ఉండగా అయితే మెగాస్టార్ చిరంజీవి కంటే ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఓ చిరు హీరోకి దొరికింది.హీరోకి మాత్రమే కాదు హీరోలకు మొత్తం చిత్ర బృందానికి మొత్తం అపాయింట్మెంట్ ఇవ్వడం ఆసక్తిని రేపుతుంది. ఆటో రజిని పేరుతో వస్తున్న సినిమాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి క్లాప్ కొట్టారు. జేఎస్ఆర్ మూవీస్ పతాకంపై జొన్నలగడ్డ శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాలో జొన్నలగడ్డ హరికృష్ణ హీరో... అయితే జొన్నలగడ్డ హరికృష్ణ ఇంతకుముందు ప్రేమెంత పనిచేసే నారాయణ అనే సినిమాలో నటించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసి తన రెండవ సినిమాకి ఆశీస్సులు తీసుకున్నారు హీరో జొన్నలగడ్డ హరికృష్ణ. తాడేపల్లిలోని జగన్ మోహన్ రెడ్డి నివాసం లో ఆటో రజిని చిత్ర యూనిట్ ఆయనను కలిసి సినిమాకు ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. అయితే ఎన్నో రోజులుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్న చిరంజీవి అపాయింట్మెంట్ దొరకలేదు కానీ... చిన్న హీరో సినిమా చిత్ర బృందం మొత్తానికి జగన్ అపాయింట్ మెంట్ దొరకటం ఆసక్తి రేపుతోంది.