నిరుద్యోగులకు శుభవార్త.. ఈ మధ్య కాలంలో ఏపీలో మనం ఎక్కువ వింటున్న మాట. నిజమే ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల్లోనే నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రాలో మరోసారి ఉద్యోగాలు భర్తీ చెయ్యాలని ఆలోచిస్తున్నారు. త్వరలోనే ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆంధ్రాలో నోటిఫికేషన వెలువడనుంది. 


అయితే ఇప్పుడు 10వ తరగతి అర్హతతో 5,476 ఉద్యోగాలు ఏపీకి సంబంధించినవి కాదు.. భారత్ కు సంబంధించిన ఉద్యోగాలు. భారత్ ప్రభుత్వానికి చెందిన తపాలా సంస్ద ఇండియా పోస్ట్ తాజాగా భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. అయితే ఇటీవలే దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో దాదాపు 10,000 పైగా గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల్ని భర్తీ చేసింది ఇండియా పోస్ట్. 


అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ లో మరి కొన్ని పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేసింది. అయితే దాదాపు 5,476 ఖాళీలను ప్రకటించింది. బ్రాంచ్ మేనేజర్, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్, డాక్ సేవక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఇండియా పోస్ట్. అయితే ఈ పోస్టులకు అర్హత 10వ తరగతి పాసైనవారు వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 


రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈరోజే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి నవంబర్ 21 చివరి తేదీ. అయితే మొత్తం ఖాళీలు- 5,476 ఉండగా.. తెలంగాణలో 970, ఆంధ్రప్రదేశ్ లో 2707, చత్తీస్‌గఢ్ లో 1799 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. విద్యార్హత.. మ్యాథ్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్‌తో 10వ తరగతి మంచి మార్కులతో పాస్ కావాలి. అయితే 10వ తరగతి మొదటి ప్రయత్నంలో పాసైన వారిని మెరిట్‌గా గుర్తిస్తారు. కాగా స్థానిక భాష తెలిసుండాలి. 


కాగా 60 రోజుల బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్ కోర్స్ సర్టిఫికెట్ పొంది ఉండాలి. మెట్రిక్యులేషన్, ఇంటర్ విద్యలో కంప్యూటర్ సబ్జెక్ట్ ఉన్నా సరిపోతుంది. వయస్సు 2019 అక్టోబర్ 15 నాటికి 18 ఏళ్ళు పైనా 40 ఏళ్లల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం.. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. 


మరింత సమాచారం తెలుసుకోండి: