చేపలు అంటే ఇష్టపడని వారుండరు. కొందరైతే ఈ చేపలను అమితంగా ఇష్టపడటమే కాదు. రుచికరమైన చేపలు ఎక్కడున్న, ఎంత దూరంలో ఉన్న ఆ ప్రదేశానికి మరీ వెళ్లి ఆర్డరిచ్చుకుని వండిచ్చుకుని తినివస్తారు. ఇలా ఇష్టపడి చేపలను తినే ప్రదేశాల్లో నాగార్జున సాగర్‌ ఒకటి. ఎందుకంటే పచ్చని ప్రకృతి సోయగాలూ, అందులోనూ.. వయ్యరంగా పారే జలపాతాలను చూస్తే.. ఎంతసేపైనా.. అక్కడే ఉండాలనిపిస్తుంది. అందుకే.. నాగార్జున సాగర్‌కి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. పైనుంచి కిందకు జాలు వారుతున్న నీటి అందాలు చూసేందుకు సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు కూడా.


ఇకపోతే కనులకు అద్బుతంగా తోచే ఈ అపురూప దృశ్యం చూసి పరవశించిపోతారు కూడా. ఇక అందులోనూ ఆదివారమైతే.. నాగార్జున సాగర్‌కు పర్యాటకులు పోటెత్తుతారు. దీంతో.. కిలో మీటర్ల మేర అక్కడ ట్రాఫిక్ జాం ఏర్పడుతుంది. అందులోనూ.. చల్లటి సాయంత్రం వేళ.. సాగర్.. శబ్ధాల నడుమ..సేద తీరుతూ.. కొంతమంది పర్యాటకులు.. అక్కడే ఉన్న కాలువల్లోని చేపలను ఖరీదు చేసి ఫ్రై రూపంలో.. లేక పులుసులా వండించుకుని తింటారు. ఇది నిన్నటివరకున్న ఆనందం కాని ఇప్పటినుండి ఆ చేపలు తింటే మాత్రం మీరు ఖచ్చితంగా అనారోగ్యానికి గురవుతారు..! ఎందుకని అనుకుంటున్నారా..!


నాగార్జున సాగర్‌ నీటిలో.. యురేనియం కలుస్తుందట. అది ప్రాణానికి ఎంత హాని చేస్తుందో.. మీకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే.. ఈ మధ్య యురేనియం తవ్వకాలపై.. పెద్ద ఎత్తున ఆందోళనలు అల్లుకున్నాయి. అందులోనూ.. అక్కడే తిరిగాడే.. చేపలను తింటే.. ఉన్న ఆరోగ్యం పక్కన పెడితే.. లేనిపోని రోగాలు, అనవసరమైన సమస్యలు మరిన్ని ఎక్కువవుతాయట. ఇంతేగాక యురేనియంలోని గామా కిరణాలకు ఎంతటి బలమైన కాంక్రీటునైనా విచ్ఛిన్నం చేయగలిగే శక్తి ఉంటుందట.


ఇక ఈ దేహం ఏం తట్టుకుంటుంది చెప్పండి... ఇక ఈ యురేనియం వల్ల కలిగే నష్టాలు ఏంటంటే.. యురేనియంలో.. సీసం 75 శాతం అధికంగా ఉంటుంది కాబట్టి ఈ నీటిని తాగిన ప్రాణులు. చాలా దుష్పలితాలకు గురికావాల్సి ఉంటుంది.. యురేనియం కలిసిన నీటిని ఒక్కసారి తాగినా ప్రమాదకరమే..దీని వల్ల జన్యుపరమైన లోపాలు తలెత్తుతాయి. అని వైద్యులు తెలుపుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: