తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఏంటో ఇప్పుడు అందరికీ తెలుసు. ఆ పార్టీ మనుగడే ఇప్పుడు తెలంగాణలో కష్టమయిపోయింది. పార్టీలో నాయకులు లేరు .. ఆ పార్టీకి సీట్లు లేవు. హైదరాబాద్ పితామహుడిగా చెప్పుకునే చంద్రబాబును అక్కడి నుంచి లేకుండా ప్రజలు మాయం చేశారు. అయితే ఇప్పుడు ఏపీలో కేవలం 23 సీట్లతో వెంటిలేటర్ మీద బతుకుతున్న టీడీపీ పార్టీ తెలంగాణ టీడీపీ మాదిరిగా తయారవుతుందని చెప్పాలి. ఇప్పటికే ఆ పార్టీలో ఉన్న ప్రధాన నేతలు బీజేపీ ఖండువా కప్పుకున్నారు. మరి కొంత మంది వైసీపీలోకి వచ్చేశారు. ఇప్పటికే టీడీపీ పార్టీ కంచుకోటలు దెబ్బ తిన్నాయి. ఇప్పుడు పార్టీకి కవచ కుండలాంటి నాయకులూ కూడా దూరం అవడంతో టీడీపీ పార్టీ తెలంగాణలో తుడుచుకుపోయినట్టు పోయినా ఆశ్చర్యం లేదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కడపలో ఫైర్ బ్రాండ్ గా చెప్పుకునే ఆదినారాయణ రెడ్డి టీడీపీ నుంచి బీజేపీలోకి జంప్ అయిన సంగతీ తెలిసిందే.


ఇప్పటికే టీడీపీకి ఉన్న ఆర్ధిక మూల స్థంభాలైన నలుగురు రాజ్య సభ ఎంపీలు బీజేపీలోకి వెళ్లిపోయిన సంగతీ విధితమే. దీనితో టీడీపీ పార్టీ మనుగడకే ప్రమాదం ఏర్పడింది. ఎన్నికల ముందు టీడీపీ మునిగిపోయే నావ అని కొంత మంది ముందుగానే అర్ధం చేసుకొని వైసీపీలోకి వెళ్లిపోయారు. టీడీపీలో ఉండిపోయిన నేతల పరిస్థితి ఘోరంగా తయారైంది. దీనితో ఇప్పుడు ఈ నేతలు టీడీపీలో ఉండి తప్పు చేశామని ఆఫ్ ది రికార్డు చర్చించుకుంటున్నారు. 


టీడీపీ పార్టీ మళ్ళీ కోలుకుంటుందని ఇప్పుడు ఏ నేత కూడా గట్టిగా చెప్పలేని పరిస్థితి. మొన్న తోటా త్రిమూర్తులు వైసీపీలో చేరిన సంగతీ తెల్సిందే. ఇప్పటీకే పలువురు నేతలు టీడీపీ పార్టీకి రాజీనామా కూడా చేసిన సంగతీ తెలిసిందే. టీడీపీ పార్టీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో నేతలందరికీ అర్ధం అయ్యింది. పైగా చంద్రబాబుకు వయసు కూడా అయిపోవడంతో ఆ పార్టీని వదిలిపెట్టడం మంచిదని నేతలు అభిప్రాయపడుతున్నారు. టీడీపీలో 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నా వారందరు ఎందుకు పార్టీలో ఉన్నారో అందరికీ తెలిసిందే. వైసీపీ తలుపులు తెరిస్తే చాలు ... వెంటనే దూకేందుకు సిద్ధంగా ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: