తిరుమల మందుబాబులకు పెద్ద షాక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. తిరుమలలో సంపూర్ణ మద్యపాన నిషేధానికి పాలక మండలి తీర్మానం చేసిందని టీటీడీ చైర్మన్
వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. నేడు ఉదయం టీటీడీ పాలక మండలి సమావేశం జరగగా.. సమావేశం ముగిసిన అనంతరం టీటీడీ చైర్మన్
వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు.
మీడియాతో మాట్లాడిన వైవి సుబ్బా రెడ్డి బోర్డు తీసుకున్న నిర్ణయాలను ప్రకటించారు. స్విమ్స్ ఆస్పత్రిని పూర్తిస్థాయిలో టీటీడీ ఆధీనంలోకి తీసుకుని అభివృద్ధి చేస్తామని సుబ్బా రెడ్డి చెప్పారు. కాగా గరుడ వారధిని మార్పులు, చేర్పులతో పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు.
తిరుమలలో సంపూర్ణ మద్యపాన నిషేధంపై చేసిన తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపుతామని వైవి సుబ్బారెడ్డి చెప్పారు. కాగా శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా పూర్తి చేసిన శాశ్వత, కాంట్రాక్టు ఉద్యోగులకు 'బ్రహ్మోత్సవ బహుమానం' అందించనున్నట్టు ప్రకటించారు.
ఇందులో భాగంగానే శాశ్వత ఉద్యోగులకు రూ.14వేలు, కాంట్రాక్టు ఉద్యోగులకు రూ.6,850 ఇవ్వాలని నిర్ణయించారు. తిరుమలలో మూడు నెలల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించాలని నిర్ణయం తీసుకున్నట్టు
వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కాగా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం తిరుపతిలో 'శ్రీవారి భక్తిధామం' నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామని అయన తెలిపారు.