ఛీఛీ.. ఈ మగవాళ్ళు ఎంత నీచానికి దిగజారుతున్నారంటే .. మొన్నటి వరుకు ఆడవారిపై అత్యాచారాలు చేసే వారు.. నిన్న అభంశుభం తెలియని పసిపిల్లలపై అత్యాచారాలు చేసారు.. ఇప్పుడు మూగజీవాలపై అత్యాచారాలు చేసి కామాన్ని తీర్చుకుంటున్నారు. మొన్నటిమొన్న మన తెలంగాణలోనే ఓ కామాందుకు ఓ దూడపై అత్యాచారం చేశాడు.    

    

ఇప్పుడు బ్రిటన్ లో ఇలాంటి అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి పిల్లిపై అత్యాచారం చేసి దాన్ని దహనం చేశాడు. బ్రిటన్ లో వొకింగ్ అనే పట్టణంలోని రహదారిపై రెండు రోజుల క్రితం ఓ పిల్లి సగం కాలిన స్థితిలో స్థానికులు కంటపడటంతో వారు పిల్లిని వెంటనే వెటర్నరీ ఆసుపత్రికి తీసుకెళ్లారు.         

    

దీంతో ఆ పిల్లకి డాక్టర్లు హుటాహుటిన చికిత్స చేసి రక్షించారు. అయితే ఆ పిల్లిపై అత్యాచారం జరిగిందని.. ఆ తర్వాత ఆ పిల్లిపై వేడి మైనం పోసి చంపేందుకు ప్రయత్నించారని నివేదికలో వెల్లడి అయ్యింది. ఏ విషయాన్ని విన్న స్థానికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. మైనం వేడికి పిల్లి శరీరం చాలా భాగం కాలిపోయిందని, ప్రస్తుతం కోలుకుంటోందని డాక్టర్లు చెప్పారు.

        

అయితే ఈ ఘటన ఇప్పుడు బ్రిటన్‌లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఒక్క బ్రిటన్ లోనే కాదు.. ఇది ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం. కామంతో ఈ మగాళ్ల కళ్ళు మూసుకుపోతున్నాయి. ఇప్పుడు పరిస్థితిల్లో మహిళలతో పటు జంతువులును కూడా కామ పిశాచాలనుంచి కాపాడుకోలేని రోజులు వచ్చేసాయి. ఏది ఏమైనా ఇప్పటి నుండి మీ ఆడపిల్లలతో పాటు మీ ఇంట్లో ముగా జంతువులను కూడా జాగ్రత్తగా కాపాడుకోండి. లేకుంటే నీచ కామాంధుల చేతుల్లో నలిగిపోతాయి. 

   

మరింత సమాచారం తెలుసుకోండి: