ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి రెడ్డిని టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేశ్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ నేడు మధ్యాహ్నం కలిశారు. ఆంధ్ర ప్రదేశ్ లోని తాడేపల్లిలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసానికి నమ్రత వెళ్లారు. అక్కడ వైఎస్ భారతితో భేటీ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే సూపర్ స్టార్ తండ్రి కృష్ణ స్వగ్రామం అయినా బుర్రి పాలెంను దత్తత తీసుకున్నారు. 

             

అయితే ఆ గ్రామ అభివృద్ధి అవ్వడానికి చెయ్యాల్సిన పనుల గురించి భారతితో నమ్రత చేర్చించారు. అలాగే ఆ గ్రామంలో నమ్రత చేపట్టిన పనుల గురించి వైఎస్ భారతికి వివరించారు. గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని నమ్రత కోరారు. కాగా తమ ఇంటికి నమ్రతకు భారతి ఘాన స్వాగతం పలికారు. 

                  

అనంతరం ఎలా ఉన్నారు అని ఇద్దరు ప్రశ్నించుకునేకి పలు ముఖ్యమైన అంశాల గురించి చేర్చించుకున్నారు. కాగా నమ్రత భారతిని కలిసే,ఉందు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితుల ఆశీర్వచనం నమృత అందుకున్నారు. కాగా ఆలయ ఈవో నమ్రతకు అమ్మవారి చిత్రపటాన్ని, లడ్డు ప్రసాదాన్ని అందించారు. 

               

కాగా రెండు రోజుల క్రితం సూపర్ స్టార్ మహేష్, నమ్రత, కూతురు, కొడుకుతో ఓ కమర్షియల్ యాడ్ చేసి వార్తల్లో నిలిచినా సంగతి తెలిసిందే. అయితే ఇలా కుటుంబంతో కమర్షియల్ యాడ్ మహేష్ మొదటి సారిగా చేశారు. కాగా ఈ కమర్షియల్ యాడ్ ఇప్పటికి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. కమర్షియల్ యాడ్ లో మహేష్ అదుర్స్ అంటూ నెటిజన్లు కామెంట్లు కూడా పెడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: