2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం చూసి కాంగ్రెస్ పార్టీ మానసికంగా చాలా కుంగి పోయింది. పార్టీ కోలుకోవడానికి ఇంకా చాలా టైం పడుతుందని భావించింది. అయితే జనాల అభిప్రాయాలు శెరవేగంగా మారిపోతుంటాయి. ఇప్పుడు తాజాగా మహారాష్ట్ర  హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ మీద ప్రజలకు ఇంకా నమ్మకం ఉందని తెలుస్తుంది. పార్లమెంట్ ఎన్నికలప్పుడు అన్నీ రాష్ట్రాల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. దీనితో ఇక మోడీసారధ్యంలోని బీజేపీకి తిరుగు లేదనుకున్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటర్లు గట్టి ఝలక్ ఇచ్చారు. మహారాష్ట్ర ఎన్నికల్లో గత పర్యాయంలో బీజేపీకి వచ్చిన సీట్ల కంటే సుమారు 23 స్థానాలు ఇప్పుడు తగ్గిపోయాయి.


మొత్తం 288 స్థానాల్లో బీజేపీకి వచ్చింది కేవలం 101 స్థానాలంటే అర్ధం చేసుకోవచ్చు బీజేపీ మీద ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోందని .. మరో పక్క శివసేనకు కూడా మూడు నాలుగు సీట్లు తగ్గిపోయాయి. శరద్ పవర్ నాయకత్వంలోని పార్టీకి సీట్లు భారీగా పెరిగినాయి. అయితే తాజా ఎన్నికల్లో బీజోకి సీట్ల తగ్గుదల వల్ల కాంగ్రెస్ పార్టీ ఆశలు పెంచుకోవచ్చు. ఓటర్లు తమ అభిప్రాయాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటారని తాజా ఎన్నికలే నిదర్శనమని చెప్పాలి.


అయితే హర్యానాలో కూడా బీజేపీ పరిస్థితి దిగజారి పోయింది. గత పర్యాయంలో వచ్చిన సీట్ల కంటే ఇప్పుడు ఇంకా తగ్గిపోయాయి. మరో పక్క కాంగ్రెస్పార్టీ బలం పుంజుకుంది. అయినా హర్యానాలో బీజేపీ పార్టీ స్వతంత్ర అభ్యర్థుల సహాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు. ఇక మహారాష్ట్రలో కూడా శివసేన కూటమితో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు. అయితే రెండు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఎవరికీ ఎటువంటి సందేహం లేకపోయినా .. బీజేపీ మేల్కోవాల్సిన సమయం వచ్చింది. బీజేపీ ప్రభుత్వం ఇంకా బాగా పనిచేయలేకపోతే వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయినా ఆశ్చర్యం లేదని చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: