కొత్త జిల్లాల ఏర్పాటు, ఏకీకృత సర్వీస్ వ్యవహారం ఒక అడుగు ముందు, రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతుంది. కొత్త జిల్లాలను రాష్ట్ర పతి ఉత్తర్వుల్లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఫైల్ ను వెనక్కి పంపింది కేంద్రం.. కోర్ట్ తీర్పు తర్వాత చూద్దామని చెప్పింది. 


రాష్ట్ర పతి ఉత్తర్వుల్లో సవరణ కోరుతూ తెలంగాణ ప్రభుత్వం పంపిన ఫైల్ ని కేంద్రం తిప్పి పంపింది. కొత్త జిల్లాలు, కొత్త జోన్ల ఏర్పాటు, ఉద్యోగాల క్యాడర్ లలో మార్పులు చేస్తూ రాష్ట్ర పతి కొత్త ఉత్తర్వులను జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు  గత ప్రెసిడెన్షియల్  ఉత్తర్వులను మార్చి.. కొత్త ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం  కేంద్రాన్ని కోరింది. దాంతో గతంలోనే కేంద్రం ఆమోదించి  రాష్ట్ర పతి ఉత్తర్వులను జారీ చేసింది.


అయితే ఆ ఉత్తర్వుల తర్వాత కొత్తగా మరో రెండు జిల్లాలు ఏర్పడ్డాయి  వాటిని కూడా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో చేర్చాలని కేంద్రానికి పంపింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే కేంద్ర ప్రభుత్వం దాన్ని వెనక్కి పంపించింది. కోర్టు లో కేసు ఉన్నందున.. అది తేలే వరకు రాష్ట్ర పతి ఉత్తర్వులు అమలు చేయొద్దని చెప్పింది. ఆర్టికల్ 371 కి వ్యతిరేకంగా రాష్ట్రపతి ఉత్తర్వులు ఉన్నాయని ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం కోర్ట్ కి వెళ్లడం తో కోర్ట్ స్టే విధించింది... ఏకీకృత సర్వీస్ రూల్స్ సాధ్యం కాదని... జిల్లా పరిషత్ టీచర్లను ప్రభుత్వ టీచర్లను ఒకే రూల్స్ కిందకు తేవడం కుదరదని ప్రభుత్వ టీచర్లు కోర్టు లో కేసు వేశారు.. అయితే రాష్ట్ర పతి ఉత్తర్వుల్లో మార్పులు చేసి ఏకీకృత సర్వీస్ రూల్స్ ను అమలు చేసుకోవచ్చని సుప్రీం కోర్ట్ డైరెక్షన్స్ ఇచ్చింది... 
 
కొత్తగా తయారు చేసిన రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఆ మేరకు మార్పులు చేశారు... వీటిపై కోర్ట్ కు వెళ్లడం తో కోర్టు స్టే విధించింది... కేసు కొలిక్కి వస్తేనే కొత్త రాష్ట్రపతి ఉత్తర్వులు అమలులోకి వస్తాయని,  ఆ తర్వాతే కొత్త జిల్లాలు చేర్చడం వీలవుతుందని తేల్చి చెప్పింది. తద్వారానే వికారాబాద్ ని చార్మినార్ జోన్ లో కలపడం జరుగుతుందని తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: