మొన్న జరిగిన హుజూర్
నగర్ ఉప ఎన్నికలు అందరికి గుర్తు ఉంటుంది. తెలంగాణాలో అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోని నాయకులకు సవాల్ గా మారినా
హుజుర్ నగర్ ఉప ఎన్నికలో
కాంగ్రెస్ టీఆరెఎస్ చేతిలో ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది. మేము ఏ గెలుస్తాం అని చెప్పుకున్న వారందరికీ చుక్కలు కనిపించేలా చేసింది ఈ ఉపఎన్నిక.
అయితే ఈ ఎన్నికల్లో మేము గెలుస్తాం అని చెప్పుకున్న
కాంగ్రెస్ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. దీంతో ప్రస్తుతం
కాంగ్రెస్ సైలెంట్ గా ఉంది. అయితే
టీఆర్ఎస్ మాత్రం వారి గెలుపుని
దీపావళి వెలుగులతో జరుపుకుంటున్నారు. ఈసారి టిఆర్ఎస్ ఓడిపోతుంది అని చాల మంది అనుకున్నారు.. కారణం ప్రస్తుతం తెలంగాణాలో జరుగుతున్న
ఆర్టీసీ సమ్మె కారణంగా ఈసారి టిఆర్ఎస్ కి దెబ్బ పడుతుంది అనుకున్నారు.
కానీ అదృష్టం బాగుండటం వల్ల పార్టీ పరువుని ఈ ఉప ఎన్నికలతో నిలబెట్టుకున్నారు. అయితే ఈ ఉప ఎన్నికల ప్రచార సమయంలో ఒక్కరిపైనా ఒకరు బాగానే విమర్శలు చేసుకున్నారు. అయితే ఆలా ఎన్నికల ప్రచార సమయంలోనే కేటీఆర్ .. అతని
కవిత అక్కను గెలిపించుకోలేకపోయాడు.. కానీ నేని మా ఉత్తమ్
పద్మావతి అక్కను గెలిపించుకుంటా అని ఛాలంజ్ చేశాడు.
అయినా పాపం.. గెలిపించుకోలేకపోయాడు.. దీంతో ఉప ఎన్నికల్లో అక్క
పద్మావతి ఓడిపోయినా సమయం నుంచి ఏంటి బాబు నువ్వు కూడా మీ అక్కను గెలిపించుకోలేకపోయావే అని
రేవంత్ రెడ్డిని కామెంట్లు చేస్తున్నారట.. అయితే అంతర్గతంగా రాజకీయ నాయకులూ కూడా అదే కామెంట్ చేస్తున్నారట. మరి ఈ కామెంట్లు నిజామా కదా అనేది తెలియాల్సి ఉంది.