అబ్బా అబ్బా ఈ మధ్యకాలంలో ఎన్ని వింత ఘటనలు జరుగుతున్నాయి అంటే చెప్పకూడదు.. రాయాలి.. అందుకే రాస్తున్న. ఈ కాలం యువత పెళ్లి చేసుకోకుంటే మంచిది.. ఎందుకంటే పెళ్ళైతే చాలు చిన్న చిన్న విషయాలకు కూడా కోర్టుకు వెళ్తారు. చిన్న చిన్న మాటలకూ కూడా హత్యలు చేసుకుంటారు. 

        

 
మరికొందరు అయితే .. కోర్టు చుట్టూ.. విడాకుల కోసం ఎంత కాలం అని తిరుగుతంలే.. అని భర్తను వదిలి ప్రియుడితో వెళ్లిపోతున్నారు. ఇంకా విషయానికి వస్తే.. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ జిల్లాలో ఓ భార్య తినడానికి కోడిగుడ్లు తేవటంలేదన్న కోపంతో భర్తను విడిచి ప్రియుడితో పారిపోయింది. 

      

 
 
ఈ వింత ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటన శనివారం జరిగింది. గోరఖ్‌పూర్‌ జిల్లాలోని కంపేర్‌గంజ్‌కు చెందిన ఓ మహిళ ప్రతిరోజూ తినడానికి గుడ్లు తీసుకురావాలని భర్తతో గొడవపడేది. రోజు కూలీతో భర్త ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తీసుకురాను అని చెప్పేవాడు. దీంతో తరచు గొడవలు జరిగేవి. 

   

 
ఎన్ని చెప్పిన తీసుకురావడం లేదనే కోపంతో శనివారం మహిళ భర్తతో గొడవపడి ప్రియుడితో ఇంట్లోంచి పారిపోయింది. దీంతో ఈ విషయాన్నీ పోలీసులకు చెప్పి కంప్లైంట్ ఇచ్చాడు. అయితే ఈ ఘటనపై మహిళ భర్త మీడియాతో మాట్లాడుతూ.. 'అతనో దినసరి కూలీ అని . అతని ఆదాయంతో ప్రతి రోజూ కుటుంబానికి గుడ్లు తెచ్చిపెట్టే పరిస్థితి అతనికి లేదని, ఈ బలహీనతను అలుసుగా తీసుకుని అతని భార్య రోజూ గుడ్లు కావాలని గొడవ పెట్టుకునేది అని. ఆమె ప్రియుడు ప్రతి రోజూ గుడ్లు తెచ్చి ఇచ్చేవాడని, అందుకే అతడితో పారిపోయిందని'ని తెలిపాడు. దీంతో ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: