ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖజిల్లా లోని కైలాసపురం లో DLB గ్రౌండ్ lO జరిగిన
వైసిపి బహిరంగ సభ లో
జగన్ పరిపాలన పై స్పందించాడు.
జగన్ పరిపాలన లో ప్రాజెక్టులన్నీ నిండాలి అని ఆయన ఆశిస్తూ ఇప్పటివరకు చేసిన అభివృద్ధిని మించిన అభివృద్ధి రానున్న నాలుగేళ్లలో మనం చూడబోతున్నాం అని ఆయన అన్నారు. వైఎస్ఆర్సిపి పార్టీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కై స్థాపించబడింది అని... తాము అనుక్షణం ప్రజా సంక్షేమానికి పాటు పడతామని
ఎంపీ విజయసాయిరెడ్డి అన్నాడు.
కైలాసపురం లోని డి.ఎల్.బి గ్రౌండ్లో జరిగిన బహిరంగ సభలో
ఎంపీ విజయసాయి రెడ్డి తో పాటు
మంత్రి మొత్తంశెట్టి శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు. 'అభివృద్ధి మంత్రం' అనే పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వివిధ అభివృద్ధి పనులకు
ఎంపీ విజయసాయిరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ మధ్యనే
జనసేన పార్టీ అధ్యక్షుడు
పవన్ కళ్యాణ్ పైన తీవ్రస్థాయిలో విరుచుకుపడిన విజయ సాయి రెడ్డి తాజాగా చంద్రబాబు పార్టీని నడుపుతున్న తీరు మరియు వైనం గురించి కూడా కొన్ని ఘాటైన కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.
ఇక పోతే నిన్న జరిగిన బహిరంగ సభ లో ఆయన ప్రసంగిస్తూ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖచిత్రాన్ని
జగన్ పాలన మారుస్తుందని... భారతదేశం లో
ఆంధ్రప్రదేశ్ ను అగ్రరాజ్యంగా తీర్చిదిద్దే విధంగా
జగన్ పరిపాలించబోతున్నారని ఆయన అన్నారు. ఇకపోతే
జగన్ మద్యపాన నిషేధం, రైతులకు భరోసా, ముసలి వారికి పెన్షన్ లు మరియు సచివాలయాలు ద్వారా ఉద్యోగ కల్పన వంటి తదితరమైన మంచి పనులు చేసిన విషయం తెలిసిందే. ఇటువంటి నేపథ్యం లో విజయసాయిరెడ్డి ఎంత సంచలనం గా
జగన్ ను ఎత్తేసినా కూడా ఆంధ్ర ప్రజానీకానికి సబబుగానే తోస్తుంది మరి.