ఇప్పుడు రాష్ట్రమంతట భయంకరంగా విస్తరిస్తున్న మహమ్మారి డెంగ్యూ. దీని బారిన పడి ఎందరో ప్రాణాలను వదిలేస్తున్నారు. అంతే కాకుండా కుటుంబాలకు కుటుంబాలను కూడ ఈ డెంగ్యూ పొట్టన పెట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ డెంగ్యూ తెలుగు రాష్ట్రాల్లో ఎంత సీరియస్ డిసీజ్‌గా తయారయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే దీని బారిన పడి ఈమధ్య ఖమ్మంలో ఓ మహిళా జడ్జీ తనువు చాలించారు.


తాజాగా మంచిర్యాలలో ఓ కుటుంబంమే డెంగ్యూతో ప్రాణాలు కోల్పోయింది. వెంటనే టెస్టులు ద్వారా గుర్తిస్తే పర్లేదు కానీ కొందరికి డెంగ్యూ వచ్చినా జ్వ‌రం, బాడీ పెయిన్స్ లాంటి లక్షణాలు  క‌నిపించ‌డం లేదు. ఈ క్ర‌మంలో వారిలో కొంద‌రు ప్లేట్‌లెట్ల‌ను బాగా కోల్పోతుండ‌డంతో  ప్రాణాలు కోల్పోయే స్థితికి  చేరుకుంటున్నారు. ఇది చాలా డేంజరస్. దీన్ని వైద్య పరిభాషలో ‘అఫెబ్రిల్ డెంగీ’ అంటారని వైద్యులు పేర్కొంటున్నారు..


ఇకపోతే అఫెబ్రిల్ డెంగీ’ అంటే జ్వరంగానీ, ఇతర లక్షణాలు కానీ లేకుండా డెంగ్యూ రావడం అని అర్ధం.. ఇది ఎక్కువగా మధుమేహం ఉన్నవారికి, వయసు పైబడినవారికి, చిన్న పిల్లలకి, ఇమ్యునిటి పవర్ తక్కువగా  ఉన్నవాళ్లకు ఈ జ్వరం లేని డెంగీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని డాక్టర్లు చెప్తున్నారు. 


ఇక ఇలా వచ్చే డెంగ్యూ చాలా ప్రమాదకరమైనదట. ఎందుకంటే తమకు డెంగీ వచ్చిందని పేషెంట్లకే తెలియదు కాబట్టి వాళ్లు డాక్టర్ దగ్గరకు కూడా వెళ్ళని పరిస్థితుల్లో విపరీత ప్రభావాలను ఎదుర్కొవాల్సి వస్తోంది. ఇక ఈ వ్యాధి వచ్చినప్పటికి జ్వరం ఇతర లక్షణాలు కనిపించక ప్లేట్ లెట్స్ కౌంట్ మాత్రం విపరీతంగా తగ్గిపోతుంది. ఇది ఎక్కువగా ఆగస్టు, సెప్టెంబర్, నవంబర్ నెలల్లో అటాక్ అవుతోంది.


దీని లక్షణాలు ఏమిటంటే ఊరికే అలసటగా అనిపించడం, ఆకలి లేకపోవడం, ఒంటిపై దద్దుర్లు, బీపీ తగ్గడం లాంటివి జ్వరం లేకపోయినా, సంభవిస్తున్నాయంటే, అది డెంగీ కావచ్చు. అలా పరిస్థితులు అనిపిస్తే వెంటనే ప్లేట్ లెట్స్ పరీక్ష చేయించు కోవడం ఉత్తమం. నాకేం అవ్వలేదని నిర్లక్ష్యంగా  వ్యవహరిస్తే ప్రాణాలు పోవడం ఖాయం....


మరింత సమాచారం తెలుసుకోండి: