నేడు జూబ్లీ బస్టాండులో దారుణం జరిగింది. బతుకున్న పసికందును బ్యాగులో పెట్టుకొని జూబ్లీ బస్టాండులో అనుమానాస్పదంగా పడే పడే తిరుగుతున్నారు. అయితే ఇది గమనించిన ఓ ఆటో డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని జూబ్లీ బస్టాండు మొత్తం వెతకడం మొదలు పెట్టారు. 

                    

అయితే పోలీసులను చుసిన ఆ ఇద్దరు వ్యక్తులు అక్కడ నుండి పారిపోయి జూబ్లీ బస్టాండు వెనుక దాక్కున్నారు. అయితే వారిని పట్టుకున్న పోలీసులు వెంటనే ఆ బ్యాగులో ఏముందో అని చూస్తే.. నిద్రపోతున్న ఓ పాప కనిపించింది. అయితే ఆ పాప ఎవరు ఏంటి? ఎక్కడ నుంచి వచ్చారు ? ఎందుకు బ్యాగులో పెట్టారు ? పప తల్లిదండ్రులు ఎవరు అని ఆ నిందుతలను ప్రశ్నించగా.. 

                 

పోలీసులకు పొంతనలేని సమాదానాలు చెప్పాడు. అయితే ఆ పాప తమ మనవరాలిని.. చనిపోయిందని.. పూడ్చటానికి వచ్చం అని పొంతనలేని సమాదానాలు చెప్పాడు. దీంతో పాపను చూస్తే ఆమె బతికే ఉంది. అనుమానం వచ్చి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. చేసిన అనంతరం పాపను గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

                

ఈ ఘటన ఈరోజు ఉదయం 9 గంటలకు జూబ్లీ బస్టాండు ప్రాంతం వద్ద జరిగింది. అయితే పాప ఎవరు ? తల్లిదండ్రులు ఎవరు ? ఎందుకు బ్యాగులో తీసుకొచ్చారు అనేది తెలియాల్సి ఉంది. కాగా ఆ శిశువు అమ్మాయి కావడంతో అమ్మాయి అని చంపేయడానికి తీసుకొచ్చార ? ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: