వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ట్విట్ స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో ట్విట్ చేస్తూ చంద్రబాబుపై సెటైర్లు వేశారు. ప్రతి రోజు ఏదొక విషయంపై స్పందించే విజయసాయి రెడ్డి, ఎవరిపై ఎలా విరుచుకు పడాలో వారిపై ఆలా విరుచుకు పడుతుంటారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుపై, తెలుగుదేశం పార్టీపై విజయసాయి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 


విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా ట్విట్ చేస్తూ.. ''ప్రజలు ముఖాన తుపుక్కున ఉమ్మేసి ఆరు నెలలు కూడా కాలేదు. పరాజితులంతా చీకటి మాటున చేతులు కలిపి వీధుల్లో పెడబొబ్బలు పెడుతున్నారు. చూసే వాళ్లకు అసహ్యం వేస్తున్నా వీళ్లకు సిగ్గనిపించడం లేదు. పచ్చ మీడియా ప్రచారం దొరుకుతుందేమో కాని మరో పదేళ్లయినా ప్రజాభిమానం సంపాదించుకోలేరు.'' అంటూ ట్విట్ చేశారు. 


అయితే 2019 ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ఓడిపోవడంపై.. వారి ముఖాలపై ప్రజలు మూశారని అన్నారు. ఆలా ఉమ్మేసి ఆరు నెలలు కూడా అవ్వకనే చీకట్లో చేతులు కలిపి విధుల్లో ప్రభుత్వంపై పెడబొబ్బలు పెడుతున్నారు అని విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చుసిన నెటిజన్లు కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. ఓ నెటిజన్ ట్విట్ పెడుతూ.. అవును సర్.. వాళ్ళకు కొంచం కూడా సిగ్గు లేదు.. అంటూ ట్విట్ పెట్టారు. దీంతో ప్రస్తుతం వారి ట్విట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: