వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ట్విట్ స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో ట్విట్ చేస్తూ చంద్రబాబుకు సిగ్గు లేదని ఘోరంగా అవమానించారు. ప్రతి రోజు ఏదొక విషయంపై స్పందించే విజయసాయి రెడ్డి ఈరోజు చంద్రబాబుపై ధ్వజమెత్తారు. చంద్రబాబుకు కొంచం కూడా సిగ్గు లేదని, మొన్న హుజుర్ నగర్ ఎన్నికల్లో ప్రజలు ఛీ కొట్టారని.. ఆయన చంద్రబాబుకు సిగ్గులేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. 


విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా ట్విట్ చేస్తూ.. '' నారా లోకేష్ తోడల్లుడి కుటుంబానికి జగ్గయ్య పేట దగ్గర బాబు రాసిచ్చిన 498 ఎకరాలను ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. వైజాగ్ నడిబొడ్డున లులూ గ్రూప్ కు దోచిపెట్టిన 14 ఎకరాల కేటాయింపును రద్దు చేసింది. హెరిటేజ్ లాగానే లులూ గ్రూపుది సూపర్ మార్కెట్ల వ్యాపారం. సైలెంటయ్యావు. మైండు బ్లాకైందా బాబూ?'' అంటూ ట్విట్ చేశారు. 


అయితే ఈ ట్విట్స్ పై కొందరు స్పందిస్తూ చంద్రబాబుపై మండిపడ్డారు. అధికారం ఉందని అందరికి పదవులు ఇచ్చుకుంటూ వెళ్లవు ఇప్పుడు చూడు ఏమైందో అంటూ ట్విట్స్ చేస్తున్నారు. మరి కొందరు ఇద్దరు పప్పులే అంటూ కామెంట్లు పెడుతున్నారు. దీంతో ప్రస్తుతం ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈ ట్విట్స్ పై ఎలా స్పందిస్తారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: