వామపక్షాల సీనియర్ నేతగా కంటే...సంచలన ఒక్కోసారి వివాదాస్పద ప్రకటనలతో వార్తల్లో నిలిచే సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ తాజాగా అదే తరహా కామెంట్లు చేశారు.
ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలిపిన సమయంలో...నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వరంగల్ జిల్లా హన్మకొండలో
సమ్మె చేస్తున్న
ఆర్టీసీ కార్మికులకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంఘీభావం తెలిపారు. ఆర్టీసీని నమ్ముకుని బతుకుతున్న 50 వేల కుటుంబాలకు అన్యాయం చేసేలా
కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రైవేటు బస్సులను రోడ్డు మీదకు తీసుకొస్తే వాటిని అక్కడే కాలబెడతామని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ హెచ్చరించారు.
ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధం కానేకాదని, చట్ట ప్రకారం ఇప్పటివరకు ప్రభుత్వం చర్చలు జరపలేదని నారాయణ అన్నారు.ఆర్టీసీ కార్మికులను తొలగించి ప్రైవేటుపరం చేసి బస్సులు నడిపితే తమ శవాలపై చక్రాలు వెళ్లాలని నారాయణ అన్నారు. కార్మికవర్గం విజయం సాధించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, చరిత్రలో
ఆర్టీసీ కార్మికుల
సమ్మె నిలిచిపోతుందని ఆయన అన్నారు. దేశ వ్యాప్తంగా
ఆర్టీసీ కార్మికులకు అన్ని సంఘాలు మద్దతుగా నిలుస్తున్నాయని చెప్పారు. బలిదానాలు లేని
తెలంగాణ కోరుకుంటే
టీఆర్ఎస్ ప్రభుత్వం ఆత్మహత్యల తెలంగాణగా మార్చిందని నారాయణ అన్నారు.
కేసీఆర్ ఆయనకు ఆయనే డెడ్ లైన్ విధించుకుంటున్నాడని నారాయణ అన్నారు. డెడ్ లైన్లు వస్తాయి, పోతాయి. కార్మికులు మాత్రం పట్టుదలతో ఉండాలని నారాయణ అన్నారు. కార్మికులకు అండగా తామంతా ఉంటామన్నారు.
కార్మికుల కాలుకు ముల్లు గుచ్చితే పంటితో పీకుతామని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు అదే పంటితో పీక నొక్కేయాలని చూస్తున్నాడని నారాయణ మండిపడ్డారు.
మంత్రి పువ్వాడ
అజయ్ కుమార్ తండ్రి వారసత్వాన్ని కించపరిచేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎంగిలి మెతుకుల కోసం ఆశపడి టీఆర్ఎస్లో చేరి,
మంత్రి పదవులు పొందిన కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు
ఆర్టీసీ కార్మికులపై అవాకులు, చవాకులు పలుకుతున్నారని,
మంత్రి పదవి పోగానే ఎర్ర బస్సు ఎక్కక తప్పదని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని నారాయణ అన్నారు. అసలైన తెలంగాణవాదులు హరీష్ రావు, ఈటెల రాజేందర్, కేటీఆర్
ఆర్టీసీ కార్మికులపై ఒక్కమాట కూడా మాట్లాడటం లేదని అన్నారు. ఆర్టీసీలో కేంద్రం వాటా 31 శాతం ఉందని.. ప్రైవేటు పరం చేస్తామంటే కేంద్రంలో అధికారంలో ఉన్న
బీజేపీ ఊరుకోదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు.
కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల చెంపపై కొడితే, కేంద్రంలో ఉన్న
మోడీ, షా లు
కేసీఆర్ చెంపపై కొడతారని ఆయన అన్నారు.
కేసీఆర్ అమ్మ మొగుడు
అమిత్ షా అని నారాయణ హెచ్చరించారు.