స్నేహం కోసం నేను నీకు ఏమి చేయలేదంటున్నావు కదా అయితే చూడు  ప్రాణం తీసుకుంటున్న  లగే నేను చిన్న తప్పు చేశానురా మీరు మన్నించలేదు. స్నేహితుల కోసం ఏం చేయలేదని మీరంటున్నారు. అందుకే స్నేహితుల కోసం ప్రాణాలు తీసుకుంటున్నాను అని ఒక ఉత్తరం రాసి మరీ  ఆత్మహత్య చేసుకున్నాడు ఓ విద్యార్ధి.

అసలు విషయానికి వస్తే  తిరుపతిలోని ఎస్‌జీఎస్ డిగ్రీ కాలేజ్‌లో బీఎస్సీ మూడవ  సంవత్సరం చదువుతున్న చదువుతున్న వేణు గోపాల్ అనే యువకుడు  మనస్థాపం చెంది బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్నేహితుల మధ్య మనస్పర్థలు రావడం తో  ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు అని సమాచారం. కారణం ఏమైఉంటుంది అన్న కోణం లో విచారం జరిపిన పోలీసులకు  ఇతడు డిగ్రీ లో చేరిన తర్వాత పరిచయమై  నాని అనే యువకుడితో వేణు గోపాల్ చాలా స్నేహంగా మెలిగేవాడు.

అయితే కొద్దిరోజుల క్రితం నాని స్నేహితురాలు మరియు ప్రియురాలు అయిన ఒక అమ్మాయి గురించి వేణు గోపాల్ తప్పుగా మాట్లాడాడు అన్న విష్యం లో వీరిద్దరికి చిన్న గొడవ అవ్వడం వీరిద్దరి మధ్య కొంత దూరం పెరగడం జరిగినప్పటినుండి నాని అతన్ని దూరం పెట్టడం చేసాడు. అలాగే మిగతా స్నేహితులు కూడా వేణు గోపాల్‌తో మాట్లాడటం మానేశారు. దీనికి మనస్థాపం చెందిన వేణు  ఆత్మహత్యకు ముందు అతడు  రాసిన లేఖలో  వీరిద్దరి ప్రస్తావన గురించి  వివరంగా రాసిపెట్టడం చర్చనీయాంశం అయ్యింది. 


 స్నేహితులు దూరం కావడంతో మూడు నెలలుగా తనలో తానే తీవ్రంగా మదనపడ్డాడు. చివరకు తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు ఒడిగట్టాడు. తన స్నేహితులంతా బాగా చదువుకుని భవిష్యతు లో  మంచి స్థాయి లో  ఉండాలంటూ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.  అమ్మాయిల కోసం ప్రాణాలు తీసుకున్నవారిని మీరు  చూసి ఉంటారు. కానీ నేను స్నేహం  కోసమే ఆత్మహత్య చేసుకుంటున్నాను అంటూ లేఖలో చెప్పుకొచ్చాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: