అయోధ్య విషయంలో సుప్రీం కోర్ట్ తుది తీర్పును ఇచ్చిన సంగతీ తెలిసిందే. అయోధ్య తీర్పు హిందువులకు అనుకూలంగా వచ్చినా ముస్లింలకు ఐదెకరాలు కేటాయించి మసీదును నిర్మించాలని కోర్ట్ ఆదేశించింది. అయోధ్య కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పు దేశంలో అన్ని ప్రధాన ముస్లిం వర్గాలు స్వాగతించాయి. తీర్పు రాగానే అసంతృప్తి వ్యక్తంచేసిన సున్నీ వక్ఫ్ బోర్డు కూడా సాయత్రమయ్యేసరికి సానుకూల ప్రకటన చేసింది. తొలుత తాము చెప్పినట్లు సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయబోమని ప్రకటించింది. తమకు ఇస్తామన్న 5 ఎకరాల భూమిలో మసీదు నిర్మించి దానికే బాబ్రీ అని పేరు పెడతామని ప్రకటించింది.సుప్రీంకోర్టు తీర్పును తాము స్వాగతిస్తున్నామని వినయంగా అంగీకరిస్తున్నామని ఉత్తర ప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ జాఫర్ ఫరూఖీ ప్రకటించారు.


అయితే సుప్రీం కోర్ట్ తీర్పును పునః సమీకించడానికీ రివ్యూ పిటీషన్ వేసే ఉద్దేశం లేడనై యూపీ వక్ఫ్ బోర్డు చెప్పుకొచ్చింది. మరోవైను అయోధ్య కేసుపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని దిల్లీకి చెందిన జామా మసీదు షాహి ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ తెలిపారు. దేశం అభివృద్ధి దిశగా సాగుతుందని ఆశిస్తున్నామని ఈ విషయంలో రివ్యూ పిటిషన్ దాఖలు చేయడాన్ని అంగీకరించమని ఆయన కూడా స్పష్టం చేశారు.


సుప్రీం కోర్ట్ తీర్పు అనంతరం ఢిల్లీలో వక్ఫ్ బోర్డు ప్రతినిధులు సమావేశం అయ్యారు.  సుప్రీంకోర్టులో వారితరఫున కేసును వాదించిన జఫర్యాబ్ జిలానీ సహా పలువురు నాయకులు దీనికి హాజరయ్యారు. తీర్పు వెలువడిన తరువాతి పరిస్థితులపై అధ్యయనం చేశారు. దేశవ్యాప్తంగా ముస్లిం సంఘాల నుంచి గానీ ప్రతినిధుల నుంచి గానీ ఎలాంటి వ్యతిరేక ప్రకటనలు రాకపోవడం... ప్రఖ్యాత అజ్మీర్ దర్గా ప్రధాన మౌల్వీ దిల్లీ జామియా మసీదు షాహి ఇమామ్ సైతం తీర్పును అంగీకరిస్తామని ప్రకటించడం ఇప్పుడు అందరికీ ఆనందకరంగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: