బెర్లిన్ గోడను కూల్చి...ముప్ఫై ఏళ్లవుతోంది. ప్రతీ ఏటా నవంబరు 9న ఉత్సవాలు జరపటం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా వేడుకలకు భారీగా ఖర్చు చేశారు. ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి...ప్రదర్శించారు. ఈ సందర్భంగా పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
1961 ఆగస్టులో బెర్లిన్ గోడ నిర్మించారు. బెర్లిన్ గోడ మొత్తం 30 మైళ్ల పొడవు ఉంటుంది. 1989లో అప్పటి
జర్మనీ సోషలిస్ట్ యూనిటీ పార్టీ ఫస్ట్ సెక్రటరీ గుంతర్ ష్వాబోస్కీ ఈ అడ్డుగోడ లేకుండా చేశారు. రెండు జర్మనీల మధ్య రాకపోకలకు అనుమతించారు. ఆర్థిక వ్యత్యాసాల్లేకుండా సాలిడారిటీ ట్యాక్స్ను కూడా తొలగించారు. అదే ఏడాది నవంబర్ 9న, 28 ఏళ్లపాటు అడ్డంగా నిలబడ్డ గోడను, ప్రజలు కేరింతలతో బద్దలుగొట్టారు. బెర్లిన్ గోడ కూలిపోయి 30 ఏళ్లయింది. రెండు దేశాల మధ్య ఈ 30 ఏళ్లలోనూ అరమరికలు లేని వాతావరణము ఏర్పడింది. కోల్డ్ వార్ ముగిసిపోయింది. తమను 40 ఏళ్లపాటు చీల్చి పాలించిన సోవియట్ యూనియన్ కుప్పకూలిపోయింది.
బెర్లిన్ గోడ కట్టిన తర్వాత సోషలిజం చెరలో ఉండలేక దాదాపు లక్షా 85 వేల మంది ఈస్ట్ జర్మన్లు బెర్లిన్ గోడను దాటినట్లుగా లెక్కలున్నాయి. వీరిలో సైనికులు, పోలీసులుకూడా ఉన్నారు. కొందరు బెర్లిన్ గోడ కింద టన్నెల్ తవ్వుకుని పారిపోయారు. మరికొందరు సరిహద్దుల్లోని సరస్సులు ఈదుకుంటూ దాటేశారు. నడుస్తున్న రైళ్ల నుంచి దూకినవాళ్లు కొందరైతే, కార్లలో రహస్యంగా పారిపోయి దాక్కున్నవారు మరికొందరు.
గోడ బద్ధలై రెండు జర్మనీలు ఒక్కటైన చారిత్రక సందర్భాన్ని రాజధాని నగరంలో ప్రతీ ఏడాది గొప్పగా నిర్వహిస్తుంటారు. డిక్టేటర్షిప్కి బలైనవాళ్ల త్యాగాల్ని గుర్తుచేసే ఉద్దేశంతో ఈ సెలబ్రేషన్స్ని జరుపుకుంటూ ఉంటారు. తూర్పు, మధ్య యూరప్లలో శాంతియుతంగా జరిగిన తిరుగుబాటులోని ముఖ్య ఈవెంట్లను నేటి తరానికి కళ్లకు కట్టినట్లు చూపాలనే లక్ష్యంతో వందకు పైగా ప్రోగ్రామ్లను వండర్ఫుల్గా ప్రదర్శించారు. సిటీలోని అన్ని ప్రాంతాల్లో ఈ నెల 4న ప్రారంభమైన ఉత్సవాలు ఇవాల్టితో ముగిశాయి. ఈ 30వ యానివర్సరీ కోసం ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకలకు దాదాపు రూ.80 కోట్లు ఖర్చు చేశారు.