చంద్రబాబు,
పవన్ కళ్యాణ్ లపై
వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తన దైన శైలిలో విమర్శలు గుప్పిస్తు కౌంటర్ ఇస్తారనే విషయం తెలిసిందే. తాజాగా మరో మారు
ఎమ్మెల్యే అంబటి రాంబాబు చంద్రబాబు
పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాజాగా చంద్రబాబు చేపట్టిన దీక్ష పై స్పందించిన అంబటి రాంబాబు చంద్రబాబు చేసింది
దొంగ దీక్ష అంటూ విమర్శించారు. ఆరు నెలలు అధికారం లేక పోయేసరికి
టీడీపీ అధినేత చంద్రబాబు కు ఫ్రస్టేషన్ ఎక్కువైపోయింది ఆయన ఏం చేస్తున్నారో ఆయనకు కూడా అర్ధం కావటం లేదని అంటూ ఆరోపించారు. తాజా ఎన్నికల్లో 151 సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చిన
ముఖ్యమంత్రి వైయస్
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాలనను చూసి ఆరునెలల్లోనే చంద్రబాబు తెగ కంగారు పడిపోతూ మిగతా వారిని కూడా కంగారు పెడుతున్నారు అని అంబటి అన్నారు. చంద్రబాబు ఎలా ఆదేశిస్తే
పవన్ కళ్యాణ్ అలా నడుస్తున్నారంటూ అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు.
పవన్
కళ్యాణ్ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని... సీఎం
జగన్ పై విమర్శలు చేస్తున్న
పవన్ కళ్యాణ్ మీకు ప్యాకేజీలు ఎక్కడి నుంచి వస్తాయి అంటూ ప్రశ్నించారు అంబటి .
ముఖ్యమంత్రి వైయస్
జగన్మోహన్ రెడ్డి గారిని హిందూ వ్యతిరేకి అనే ముద్ర వేసేందుకు
పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారని...
జగన్ పాదయాత్రకు ముందు శ్రీవారిని దర్శించుకున్నారు అని
ఎమ్మెల్యే అంబటి రాంబాబు గుర్తు చేశారు.అస్సలు రాజకీయాల్లో మత ప్రస్తావనను
పవన్ కళ్యాణ్ ఎందుకు తెచ్చారు అంటూ ప్రశ్నించిన అంబటి రాంబాబు... చంద్రబాబు
పవన్ కళ్యాణ్ జగన్ గారిని ఏం చేయాలనుకుంటున్నారు అంటూ నిలదీశారు.
ఎవరో
ఆయిల్ కొడితే మీరు బండి నడుపుతూ ఉంటే ఎలా
పవన్ కళ్యాణ్ గారు... మీ
ఆయిల్ వేసుకొని మీరు బండి నడిపితే ఎంతో బాగుంటుంది... అలా చేస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది అంటూ అంబటి రాంబాబు సెటైర్ వేశారు.23 క్లైమర్ మెన్స్ పెట్టిన తాను భయపడ లేదంటూ చంద్రబాబు చెబుతున్నారని... కానీ
కేసీఆర్ ఓటుకు నోటు కేసు భయపడి చంద్రబాబు పారిపోయారు అంటూ అంబటి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు
పవన్ కళ్యాణ్ ఢిల్లీకి దూతగా పంపించినట్లు అనుమానం వస్తుందని...
ఢిల్లీ వెళ్లి వచ్చాక
జనసేన అధినేత
పవన్ కళ్యాణ్ ఢిల్లీ ఎందుకు వెళ్లారో చెప్తారని ఆశిస్తున్నామని
ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు.