ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సర్కారు ఉచితంగా స్కూటీలను ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. గతంలో కూడా ఇలాంటి వార్తలే వచ్చాయి స్కూటీలు ఎవరికి ఇవ్వలేదు కదా అని అనుకోకండి, కాని అప్పుడు సర్కారు వేరు ఇఫ్పుడు సర్కారు వేరు. ఇఫ్పుడు జగన్ సర్కారు ఉచితంగా యాక్టీవా బైక్స్ ఇవ్వాలి అని భావిస్తోంది. అది కూడా అందరికి కాదు కొందరికి మాత్రమే.


అయితే ఎవరికి ఉచితంగా బండి ఇస్తారు దీనికి ఏమి కావాలి అంటే. ప్రభుత్వం దీనిపై ఓ ప్రకటన విడుదల చేసింది. ముఖ్యంగా అంగవైకల్యంతో ఉండి తాము ఏదైనా ఉపాధి చేసుకోవడానికి బండి కావాలి అని అనుకునేవారికి, ఉచితంగా స్కూటీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.. ఇక అంగవైకల్యం ఉన్నవారికి మూడు చక్రాల స్కూటీని ఇవ్వనున్నారు దీని కోసం మీరు అప్లై చేసుకోవచ్చు.


అయితే ప్రభుత్వం ప్రస్థుతం కేవలం 2500 మందికే ఇవ్వాలని భావిస్తోంది. అంగవైకల్యంతో ఉన్నవారు మీ గ్రామ వలంటీర్లకు మీ వివరాలు ఇవ్వాలి. అక్కడ వారు ఇచ్చే ఫారమ్ మొత్తం నింపి చేసి ఇస్తే సరిపోతుంది. మీపేరు మీ చిరునామా ఫోటో ఆధార్ కార్డ్ అంగవైకల్యానికి సంబధించి సర్టిఫికెట్ ఉంటే పొందుపరచాలి. మీకు వైట్ రేషన్ కార్డు ఉన్నా దానిని జిరాక్స్ ఇవ్వాలి. వీటిని ఇస్తే మీకు కచ్చితంగా వాలంటీర్లు రసీదు ఇస్తారు. దీంతో మీరు అప్లికేషన్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇందుకోసం ప్రభుత్వం 22 కోట్ల రూపాయలను వెచ్చిస్తోంది.


ఉచితంగా ఎవరికి ఇస్తారు అనేది పంచాయతీ ఆఫీసు్లో వారి లిస్ట్ ఫెడతారు అని తెలుస్తోంది. కాళ్లు సరిగ్గాలేని నడవలేని వారికి ముందు ప్రయారిటీ ఇస్తారట. కనీసం కదలిక ఉన్న వాళ్లకి సెకండ్ ప్రయారిటీ, ఆ తరువాత ఈ మధ్య కాలంలో అంగవైకల్యం వచ్చిన వారికి మూడవ ప్రయారిటీ ఇస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: