టాలీవుడ్లో నాగార్జున ఒక టాప్ స్టార్. ఆయన తన వరకూ కొత్త టాలెంట్ ని ఎపుడూ ప్రోత్సహిస్తారని పేరుంది. నాగ్ అంటేనే న్యూ బ్లడ్ ని ఎంకరేజ్ చేస్తాడని అంటారు. అది చాలా సార్లు ప్రూవ్ అయింది కూడా గులాబీ మూవీతో హిట్ కొట్టిన క్రిష్ణ వంశీకి నిన్నే పెళ్లాడుతా లాంటి మూవీని ఇచ్చింది ఇదే నాగ్. దాంతో బ్లాక్ బస్టర్ హిట్ క్రిష్ణ వంశీ పరమైంది.

 

ఇదిలా ఉండగా నాగ్ తన కెరీర్ మొత్తం మీద ఎంతో మంది న్యూ టాలెంటెడ్ డైరెక్టర్లకు అవకాశాలు ఇచ్చాడు. వారిలో చాలా మంది సక్సెస్ అయ్యారు. అదే తీరులో అనేక మంది ఫెయిల్ కూడా అయ్యారు. ఇక నాగ్ కెరీర్ స్పీడ్ తగ్గిన తరువాత సినిమాలు చేసిన కొత్త డైరెక్టర్ల విషయంలో మాత్రం లక్ రివర్స్ అయిందని చెబుతారు.

 

ఎందుచేతనంటే నాగ్ అప్పట్లో మాఫియా డాన్ కధతో భాయ్ అనే మూవీ చేశాడు. దానికి డైరెక్టర్ వీరభద్ర చౌదరి. ఆయన ఈ సినిమాకు ముందు చిన్న హీరోలతో హిట్లు కొట్టాడు. నాగ్ వంటి స్టార్ తో మూవీ అనగానే ఎగిరి గంతేశాడు. తీరా ఆ మూవీ భారీ డిజాస్టర్ అయింది. దాంతో  చౌదరిదే తప్పు అన్నట్లుగా నాగ్ మాట్లాడినట్లు వచ్చిన వార్తలతో ఆయన కెరీర్ పూర్తిగా బ్లాక్ లోకి వెళ్ళిపోయిందని అంటారు.

 

అదే విధంగా లేటెస్ట్ గా మన్మధుడు 2 మూవీ డైరెక్టర్ రాహుల్ విషయంలో కూడా జరిగిందని చెబుతారు. ఆయన్ సినిమాల్లో హీరోగా, ఇతర క్యారక్టర్లు చేసుకుంటూ నాగ్ మేనల్లుడుతో ఒక సినిమా చేసి హిట్ కొట్టారు. తరువాత నాగ్  ఆయన్ని పెట్టుకున్నారు. కానీ మన్మధుడు 2 డిజాస్టర్ తో ఇపుడు రాహుల్ కెరీర్ ప్రమాదంతో పడింది. వీటికంటే ముందు శ్రీనివాసరెడ్డి అనే కామెడీ డైరెక్టర్ తో నాగ్ ఢమరుకం మూవీ చేశాడు. అయితే ఆ మూవీ మాత్రం పెద్ద  ఫల్టీ కొట్టింది. దాంతో శ్రీనివాస రెడ్డి సైతం లూప్ లైన్లోకి వెళ్ళిపోయడు.

 

లేటెస్ట్ గా శ్రీనివాసరెడ్డి రానున్న ఇరవై నాలుగు గంటల్లో అన్న సినిమా చేస్తున్నాడు. ఆ మూవీ ప్రమోషన్లో మాట్లాడుతూ ఇండైరెక్ట్ గా నాగ్ మీద చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ అవుతున్నాయి. న్యూ టాలెంట్ ని ఎంకరైజ్ చేయడం వరకూ నాగ్ ఒకే కానీ వారు పడిపోయినా సినిమా ఫ్లాప్ అయినా కూడా తన వంతు కొంత బాధ్యత తీసుకుంటే బాగుంటుందన్నది టాలీవుడ్లో వినిపిస్తున్న మాట. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: