బీజేపీ ఎంపీ సుజనా చౌదరిపై వైఎస్సార్సీపీ ఎంపీలు ధ్వజమెత్తారు. సుజనా చౌదరి నోరు అదుపులో పెట్టుకోవాలని., ఆయనకున్న చరిత్ర మాకు లేదని, బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన ఘటన తమది కాదని వైఎస్సార్ సీపీ ఎంపీలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ఎంపీలు తనతో టచ్లో ఉన్నారంటూ కారుకూతలు కూస్తే సహించేది లేదని, దమ్ముంటే ఒక్క ఎంపీ పేరు చెప్పాలని వారు సవాల్ విసిరారు. సుజనా! నువ్వు ఒరిజినల్ బీజేపీనా? డూప్లికేటా?
ఢిల్లీలో శుక్రవారం వైఎస్సార్ సీపీ ఎంపీలు ఎన్.రెడ్డప్ప, నందిగం సురేష్, దుర్గాప్రసాద్, తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, సత్యవతి, గొడ్డేటి మాధవిలు మీడియాతో మాట్లాడుతూ.. సుజనా వ్యాఖ్యల్ని తూర్పారబట్టారు. బీజేపీలో చేరి చంద్రబాబు కోవర్టులా పనిచేస్తున్నావన్నారు. ఒకపార్టీ తరఫున ఎన్నికై మరో పార్టీకి మారిన బ్యాంకు దొంగవి నువ్వు.. విరాళాలు ఇచ్చి ఎంపీ పదవి కొనుక్కున్నావని వ్యాఖ్యానించారు. మేము మీలాగా ఉండబోమని చివరిదాకా మేం వైఎస్ జగన్తోనే నడుస్తామని అన్నారు.
చచ్చిన టీడీపీని బతికించేందుకు సుజనా చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని, అతని గురించి ఎవర్ని అడిగినా బ్యాంకు దొంగనే చెబుతారని ఎద్దేవా చేశారు. సుజనా, సీఎం రమేష్లను నమ్ముకొని ఏపీలో రాజకీయాలు చేయాలనుకుంటే కుక్క తోక పట్టుకొని సముద్రాన్ని ఈదినట్లేనని.. బ్యాంకులకు రూ. 6 వేల కోట్లు ఎగ్గొట్టిన సుజనా చౌదరి వాటిని చెల్లించాక మాట్లాడాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పాలనను చూసి ఓర్వలేక హద్దుదాటి ఆరోపణలు చేస్తున్నారని, వైఎస్ జగన్ తలుపులు తెరిస్తే టీడీపీ ఖాళీ అవుతుందని వారు హెచ్చరించారు. ఒక పార్టీ తరఫున ఎన్నికై మరో పార్టీలో చేరిన సుజనా గురించి ఎవర్ని అడిగినా బ్యాంకు దొంగే అని చెబుతారని వ్యాఖ్యానించారు.
మరో 15 ఏళ్లు జగనే సీఎం అవుతారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ.. ఎన్నికల్లో తమకు వైఎస్ జగన్మోహన్రెడ్డి టికెట్టిచ్చారని, కొన ఊపిరి ఉన్నంతవరకూ జగన్ వెంటే తాము నడుస్తామని వైఎస్సార్సీపీ ఎంపీలు స్పష్టం చేశారు. ‘విరాళాలు ఇచ్చి ఎంపీ పదవిని కొనుక్కున్న సుజనా చౌదరికి వైఎస్ జగన్ను విమర్శించే అర్హత లేదు. మరో 15 ఏళ్లు ఆయనే సీఎంగా ఉంటారు’ అని పేర్కొన్నారు. దానికి కారణం.. పబ్లిక్ ఇంట్రెస్టా? లేక పబ్లిక్గా తెలిసిపోయిన ఇంట్రెస్టా?. అవినీతి మీద చంద్రబాబు.. ఆకలి మీద లోకేష్ నాయుడు.. అక్రమాలపై అచ్చెన్నాయుడు.. మహిళా రక్షణ మీద చింతమనేని.. సంస్కారం మీద ఉమా.. స్పీకర్ పదవి ఔన్నత్యం మీద యనమల లెక్చర్ ఇస్తే ఎలా ఉంటుందో.. ఏపీ ప్రయోజనాలపై మీరు ప్రెస్మీట్లు పెడితే అలాగే ఉంటుంది. బ్యాంకుల లూటీపై మీరు ముంచేసిన బ్యాంకుల అధికారులతో ప్రెస్మీట్ పెట్టండి’ అని ట్వీట్ చేశారు.