ఈ మద్య కాలంలో భార్యా భర్తల అనుబంధాలు మరీ దారుణంగా మారిపోతున్నాయి. దైవసాక్షిగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన జంట ఆ బంధానికే మచ్చ తెచ్చే విధంగా తయారవుతున్నారు. వివాహేతర సంబంధాలతో దాంపత్య జీవితంలో కల్లోలం సృష్టించుకుంటున్నారు. క్షణిక సుఖం కోసం కట్టుకున్న భార్యను దారుణంగా చంపడం..తమ అక్రమ సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి చంపిన ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి.
మరీ దారుణమైన విషయం ఏంటంటే..తమ లైంగిక వాంఛ తీర్చుకునే సమయంలో కన్న పిల్లలు అడ్డు వస్తున్నారని వాళ్లను కూడా దారుణంగా హతమారుస్తున్న సంఘటనలు కూడా వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. తాను తీసుకున్న తీసుకున్న అప్పు తీర్చే మార్గం కనిపించక కట్టుకున్న భార్య శీలాన్నే తన స్నేహితుడికి తాకట్టు పెట్టేందుకు ప్రయత్నించాడో నయవంచక భర్త. ఉత్తర్ప్రదేశ్లోని ఘజియాబాద్కు చెందిన శ్యామ్, భార్య రంజితతో కలిసి జీవిస్తున్నాడు. కొంత కాలంగా మద్యం, ఇతర వ్యసనాలకు బానికగా మారిన శ్యామ్ అందినంత అప్పు చేస్తూ వచ్చాడు.
అప్పుల వాళ్లు వెంట పడుతుండటంతో సాయం చేయాల్సిందిగా స్నేహితుడు కౌశల్ను వేడుకున్నాడు. కొంత కాలంగా శ్యామ్ భార్య రంజితపై కన్నేసిన కౌశల్ ఇదే మంచి అదును అనుకొని నీ భార్యను నా బెడ్రూమ్కి పంపిస్తే నీ అప్పులన్నీ తీర్చేస్తా అని శ్యామ్ ఎదుట కౌశల్ ప్రతిపాదన పెట్టాడు. దాంతో మద్యం మత్తులో ఆ ప్రపోజల్ కి ఒప్పుకున్నాడు శ్యామ్. శుక్రవారం కౌశల్ వారింటికి వెళ్లి రంజితపై అత్యాచారం చేయబోయాడు.
స్నేహితుడి భార్యపై అఘాయిత్యానికి పాల్పడటం సరికాదని రంజిత చెప్పడంతో.. నీ భర్త నిన్ను నాకు అప్పగించాడు అని చెప్పాడు. దాంతో షాక్ కి గురైన రంజిత అక్కడ నుంచి తప్పించుకొని దగ్గరలోని పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసింది. దాంతో నింధిుతులను ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.